ఖమ్మం జిల్లా ఖాన్‌పేట్‌లో భట్టి విక్రమార్క పాదయాత్ర

Bhatti Vikramarka Padayatra In Khanpet Khammam District
x

ఖమ్మం జిల్లా ఖాన్‌పేట్‌లో భట్టి విక్రమార్క పాదయాత్ర

Highlights

Khammam: ఆరు రోజుల నుంచి కొనసాగుతున్న భట్టి పాదయాత్ర

Khammam: ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఖాన్ పేటలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. ఆరవ రోజు పాదయాత్రను ప్రారంభించారు. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత ఆరు రోజుల నుంచి అజాధీ కా గౌరవ్ పాదయాత్రను చేపట్టారు. స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించిన విషయాలను ఆనాటి ఉద్యమ నేతల త్యాగాలను నేటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేస్తూ పాదయాత్ర చేపట్టారు.

ఇవాళ్టి పాదయాత్ర పెనుబల్లి మండలం వియం బంజర్ లో ముగుస్తుంది. 75 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా రింగ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భట్టి విక్రమార్క తో పాటు మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ తదితర నాయకులు పాల్గొననున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories