Bandi Sanjay: సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్‌ లేఖ

Bandi Sanjay Letter to CM KCR
x

Bandi Sanjay: సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్‌ లేఖ

Highlights

Bandi Sanjay: దళితులు, గిరిజనులకు కేటాయించిన భూములను లాక్కొని.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయడం దుర్మార్గం

Bandi Sanjay: ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ లేఖ రాశారు.దళితులు, గిరిజనులు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలను ఆపాలని లేఖలో పేర్కొన్నారు. దళితులకు, గిరిజనులకు అసైన్‌ చేసిన భూములను లాక్కుంటూ రియల్‌ వ్యాపారం చేయడం దుర్మార్గం అన్నారు. ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కోవడం అంటే వారి నోటి కాడి ముద్ద లాక్కోవడమే అని లేఖలో చెప్పుకొచ్చారు. దళితులకు మూడు ఎకరాల సాగుభూమి ఇస్తామన్న హామీని వమ్ము చేసి దళితులు మోసం చేశారని ఆరోపించిన బండి సంజయ్.. పోడు భూములకు పట్టాలిస్తాం అంటూ హామీలివ్వడవ్వమే తప్ప అమలు చేయడంలేదన్నారు.

మీ రియల్ ఎస్టేట్ దందాకు దళితుల, గిరిజనుల భూములను గుంజుకుంటారా? దళిత, గిరిజనులంటే మీకెందుకు అంత కక్ష? బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులకు, గిరిజనులకు రక్షణ కరువైందన్నారు. దళితులు, గిరిజనుల బతుకులను ఆగం చేసే చర్యలను ప్రభుత్వం వెంటనే విడనాడాలన్నారు. అసైన్డ్‌ భూముల్లో రియల్‌ దందాకు తెరదించకుంటే బిజెపి తెలంగాణ శాఖ పక్షాన పెద్దఎత్తున ఆందోళన చేపడతామని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories