Bandi Sanjay: రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది

Bandi Sanjay: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం శాంతి భద్రతలను గాలికి వదిలేసింది

Dhatripriya
Published on: 6 March 2023 6:46 PM IST
Bandi Sanjay Comments On KCR
X

Bandi Sanjay: రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది 

Bandi Sanjay: రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం శాంతి భద్రతలను గాలికి వదిలేసిందన్నారు. వైద్య విద్యార్థిని ప్రీతి హత్య కేసుపై సీఎం కేసీఆర్‌ ఎందుకు స్పందించడం లేదన్నారు. ప్రీతి మృతిపై తల్లిదండ్రులకు ఇప్పటికీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదన్న ఆయన రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యూపీ తరహాలో కఠిన శిక్షలు అమలు చేస్తామన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు బండి సంజయ్‌.



Dhatripriya

Dhatripriya

Next Story