Bandari Lakshma Reddy: ఏ ప్రాంతం నుంచి వచ్చిన వారైనా... తెలంగాణ ప్రజలే

Bandari Lakshma Reddy On KCR
x

Bandari Lakshma Reddy: ఏ ప్రాంతం నుంచి వచ్చిన వారైనా... తెలంగాణ ప్రజలే

Highlights

Bandari Lakshma Reddy: 24 గంటల కరెంట్ ఇస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది

Bandari Lakshma Reddy: ఉప్పల్ ఏఎస్‌రావ్‌నగర్ డివిజన్‌లో మార్వాడీలు ఏర్పాటు చేసిన రాజస్థానీ ప్రవాస దీపావళి మిలన్ ‌కార్యక్రమంలో ఉప్పల్‌ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. మాజీ కార్పొరేటర్‌ కొత్త రామారావు, సింగిరెడ్డి సోమశేఖర్‌‌రెడ్డితో పాటు పలువురు స్థానిక బీఆర్ఎస్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని బండారు లక్ష్మారెడ్డి అన్నారు. ఇక్కడ నివసించే ప్రజలు ఏ ప్రాంతం నుంచి వచ్చినా... తెలంగాణ ప్రజలే అని అన్నారు. వారికి ఎల్లప్పుడూ తమ సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటానన్న ఆయన... తన బీఎల్ఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలను అందజేస్తానని హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories