Hyderabad: హైదరాబాద్‌ డీజీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత

Hyderabad: హైదరాబాద్‌ డీజీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 27 Nov 2025 2:54 PM IST
Hyderabad: హైదరాబాద్‌ డీజీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత
X

Hyderabad: హైదరాబాద్‌ డీజీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత

Hyderabad: హైదరాబాద్‌ డీజీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయ్యప్పమాల ధరించిన కంచన్‌బాగ్‌ ఎస్సై కృష్ణకాంత్‌కు మెమో జారీచేయడంపై అయ్యప్ప భక్తులు, బీజేపీ నేతలు మండిపడ్డారు. అయ్యప్ప దీక్షలో ఉన్న సిబ్బంది పట్ల పోలీస్‌శాఖ తీరు సరికాదంటూ అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. ఎస్సై కృష్ణకాంత్‌కు జారీచేసిన మెమోను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

డీజీపీ కార్యాలయం ముట్టడికి అయ్యప్ప స్వాములు, బీజేవైఎం నేతలు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో డీజీపీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించారు అయ్యప్పస్వాములు, బీజేవైఎం నేతలు. ఈ నేపథ్యంలో పోలీసులు, అయ్యప్ప మాలధారుల మధ్య తోపులాట జరిగింది. పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story