‌Hanamkonda: హన్మకొండ జిల్లా కేంద్రంలో సెల్‌షాపు యజమానికి నిప్పు

Attack with Petrol on Mobile Shop Owner in Hanamkonda District
x

Representational Image

Highlights

‌Hanamkonda: రాజుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన గణేష్, కావ్య * చిట్టీ డబ్బులు అడిగినందుకు ఆగ్రహంతో

Hanamkonda: తనకు రావాల్సిన చిట్టీ డబ్బులు అడిగినందుకు ఓ యువకుడిపై చిట్​ఫండ్ కంపెనీ ఏజెంట్, అతని భార్య కలిసి పెట్రోల్​పోసి నిప్పంటించారు. హనుమకొండ ఈ ఘటన కలకలం సృష్టించింది. బాలసముద్రానికి చెందిన యువకుడు హనుమకొండ పీఎస్ సమీపంలోని కాంగ్రెస్​భవన్​దగ్గర సెల్ ఫోన్​షాపు నిర్వహిస్తున్నాడు. వచ్చే ఆదాయంలో ఎంతోకొంత సేవ్​ చేసుకునేందుకు నక్కలగుట్ట ప్రాంతంలోని అచల చిట్​ఫండ్స్​ ప్రైవేట్​లిమిటెడ్ ​కంపెనీలో ఏజెంట్ గణేశ్ ద్వారా 5 లక్షల చిట్టీ వేశాడు. జనవరిలో చిట్టీ టర్మ్​కంప్లీట్​కాగా తనకు రావాల్సిన డబ్బు కోసం రాజు పలుసార్లు చిట్​ఫండ్ కంపెనీకి వెళ్లి అడిగాడు. అక్కడ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో చిట్టీ డబ్బులు కట్టించిన ఏజెంట్​గణేశ్​ను నిలదీశాడు. గణేశ్, అతని భార్య కావ్యతో గొడవపడ్డాడు.

దీంతో గణేశ్​ దంపతులు రాజు షాపు తగలబెట్టేందుకు ప్లాన్​వేశారు. గణేశ్​, కావ్య దంపతులు బాటిల్​లో పెట్రోల్​తీసుకుని రాజు సెల్​ఫోన్​షాపు దగ్గరికి వెళ్లారు. షాపులో ఉన్న వస్తువులతో పాటు పక్కనే ఉన్న రాజు భార్య పై పెట్రోల్​ పోసి నిప్పంటించారు. అక్కడే ఉన్న రాజు సిరిని రక్షించి బయటకు తీసుకురాగా.. కావ్య మరోసారి రాజుపై పెట్రోల్ గుప్పించింది. దీంతో ఆయన ఒళ్లంతా మంటలు వ్యాపించాయి. పక్కనే ఉన్న పాన్​షాపు యజమాని రంగయ్య, ఇతర షాపుల వాళ్లు గమనించి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. రాజు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories