Telangana: మహబూబాబాద్‌ జిల్లాలో దారుణం.. 8 నెలల గర్భిణీకి అబార్షన్

Telangana: మహబూబాబాద్‌ జిల్లాలో దారుణం.. 8 నెలల గర్భిణీకి అబార్షన్
x
Highlights

Telangana: వావిలాలలో అబార్షన్లు చేస్తున్న కాంపౌండర్‌ సంతోష్‌

Telangana: మహబూబాబాద్‌ జిల్లాలో దారుణం వెలుగుచూసింది. డబ్బు ఆశతో వావిలాలలో కాంపౌండర్‌ సంతోష్‌ అబార్షన్లు చేస్తున్న వైనం బయటపడింది. బోటిమీదితండా ఉపసర్పంచ్‌గా ఉన్న సంతోష్ ఓ నర్సు సాయంతో అడ్డగోలుగా అబార్షన్లకు పాల్పడ్డాడు. నర్సుతో కలిసి 8 నెలల గర్భిణీకి అబార్షన్‌ చేశాడు. అయితే.. మహబూబాబాద్‌ జిల్లాలో జరిగిన విషయం ఆ నోట ఈ నోట బయటకు పొక్కడంతో నర్సుతో పాటు పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి ఎట్టకేలకు మహిళతో పాటు ఐదుగురిని అరెస్ట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories