Amit Shah: ఈ నెల 28న తెలంగాణకు అమిత్‌షా

Amit Shah To Telangana On 28th Of This Month
x

Amit Shah: ఈ నెల 28న తెలంగాణకు అమిత్‌షా

Highlights

Amit Shah: రంగారెడ్డి జిల్లా కొంగర్‌కలన్‌కు రానున్న అమిత్‌షా

Amit Shah: ఈ నెల 28న తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటిస్తారని స్పష్టం చేశారు టీబీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి. మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్న కిషన్‌రెడ్డి.. రంగారెడ్డి జిల్లా కొంగర్‌కలన్‌కు అమిత్‌షా వస్తారని చెప్పారు. ఓ ఫంక్షన్‌ హాల్‌లో పార్లమెంట్‌ ఎన్నికలపై సమావేశం కాబోతున్నట్టు తెలిపారు. ఈ భేటీకి మండల అధ్యక్షుల నుంచి రాష్ట్ర అధ్యక్షుల వరకు హాజరుకావాలని ఆదేశించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇక.. ఈ సమావేశానికి సుమారు 1200 మంది హాజరవుతారని సమాచారం ఉంది. అదే రోజు.. బీజేపీ శాసనసభా పక్ష నేతను టీబీజేపీ కన్ఫామ్‌ చేయనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories