Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు

Revanth Reddy: రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలకు నోటీసులు

Shashank Gullapelli
Published on: 29 April 2024 4:56 PM IST
Aggressiveness Of Delhi Police Notices To Telangana CM Revanth Reddy
X

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు

Revanth Reddy: తెలంగాణ సీఎం, పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా డీప్‌ఫేక్‌ వీడియో కేసులో మే 1న విచారణకు హాజరు కావాలని కోరారు. ఫోన్‌ తీసుకొని విచారణకు రావాలని నోటీసులులో పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కేసులో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడికి నోటీసులు ఇచ్చేందుకు ఇద్దరు ఢిల్లీ పోలీసు అధికారులు గాంధీభవన్‌కు వచ్చారు. అయితే, ఇక్కడ సీఎం, పీసీసీ అధ్యక్షుడు ఒక్కరే అయినందున రేవంత్‌కు నోటీసులు జారీ చేశారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story