ఆదాయానికి మించిన ఆస్తులు.. మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ ఆస్తులపై ఏసీబీ సోదాలు

మహబూబ్‌నగర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. ఆయన నివాసంతో పాటు పలుచోట్ల తనిఖీలు నిర్వహిస్తోంది ఏసీబీ.

Arun Chilukuri
Published on: 23 Dec 2025 12:19 PM IST
ఆదాయానికి మించిన ఆస్తులు.. మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ ఆస్తులపై ఏసీబీ సోదాలు
X

మహబూబ్‌నగర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. ఆయన నివాసంతో పాటు పలుచోట్ల తనిఖీలు నిర్వహిస్తోంది ఏసీబీ. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనపై ఇటీవల కేసు నమోదైంది. అయితే కిషన్‌ నాయక్‌కు దాదాపు 100 కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలో కిషన్‌ నాయక్ నివాసంతో పాటు బంధువుల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story