ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

* హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం అప్పీల్ పిటిషన్

Dhatripriya
Published on: 4 Jan 2023 4:40 PM IST
A Sensational Decision Of The State Government In The Case Of Purchase Of MLA
X

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం 

MLA Purchasing Case: ఎమ్మెల్యేలకు కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. సీబీఐకి అప్పగించాలన్న సింగిల్ జడ్జి తీర్పును ప్రభుత్వం సవాల్ చేసింది. సిట్ దర్యాప్తును రద్దు చేస్తూ సీబీఐకి బదిలీ చేయాలని ఇటీవల సింగిల్ జడ్జి ఆర్డర్ ఇచ్చారు. ప్రభుత్వ అప్పీలుపై సీజే జస్టిస్ ఉజ్జల్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. 455/2022 కేసు బదిలీ ఆపాలని పిటిషన్ లో ప్రభుత్వం కోరింది. జీవో63 రద్దుపై హైకోర్టులో ప్రభుత్వం అప్పీల్ చేసింది. సిబిఐకి కేసు బదిలీ నిలిపి వేయాలని ప్రభుత్వం కోరింది. సిట్ దర్యాప్తు సాగించాలని డివిజన్ బెంచ్ లో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేయాలని ప్రభుత్వం కోరింది.

Dhatripriya

Dhatripriya

Next Story