Viral News: చెరువులో డెడ్​బాడీ ఉందన్న జనాలు.. వచ్చి చూస్తే...

A Person Who Shocked The Police In Reddypuram, Hanmakonda District
x

హన్మకొండ జిల్లా రెడ్డిపురంలో పోలీసులకు షాకిచ్చిన వ్యక్తి 

Highlights

మద్యం మత్తులో చెరువులో సేదతీరిన ఓ వ్యక్తి

Viral News: హన్మకొండ జిల్లా రెడ్డిపురం కోవెలకుంటలో ఓ వ్యక్తి పోలీసులకు షాక్ ఇచ్చాడు. మద్యం మత్తులో చెరువు నీటిలో తేలియాడుతూ మంచి నిద్రలోకి జారుకున్నాడు. అయితే చెరువులో ఆ వ్యక్తిని గమనించిన స్థానికులు డెడ్‌బాడీ అనుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న వారికి ఊహించని షాక్ ఇచ్చాడు ఆ వ్యక్తి. పోలీసులు ఆ వ్యక్తి చేయి పట్టుకుని లాగుతున్న సమయంలో ఒక్కసారిగా లేవడంతో అక్కడున్న వారందరూ అవాక్కయ్యారు. ఇక ఆ వ్యక్తిని విచారించి నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తిగా ఐడెంటిఫై చేశారు. అయితే 10 రోజుల నుంచి గ్రానైట్ క్వారీలో 12 గంటల సేపు ఎండలో పనిచేశానని.. ఎండ వేడిమి తట్టుకోలేకనే నీటిలో పడుకున్నట్లు చెప్పాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories