హైదరాబాద్‌లో విషాదం.. బాచుపల్లిలో గోడకూలి ఏడుగురి మృతి

7 members died in wall collapse Bachupally
x

హైదరాబాద్‌లో విషాదం.. బాచుపల్లిలో గోడకూలి ఏడుగురి మృతి

Highlights

Hyderabad: భారీ వర్షాలకు కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న గోడ

Hyderabad: హైదరాబాద్‌ బాచుపల్లిలో ఘోర విషాదం చోటు చేసుకుంది. రేణుక ఎల్లమ్మకాలనీలో భారీ వర్షాలకు నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్ గోడ కూలి ఏడుగురు కార్మికులు మృతి చెందారు. మృతుల్లో నలుగురు ఒడిశా వాసులు, ముగ్గురు ఛత్తీస్‌గఢ్ వాసులుగా గుర్తించారు. మృతుల్లో ఓ నాలుగేళ్ల చిన్నారి ఉన్నట్లు గుర్తించారు. మృతులు ఒడిశాకు చెందిన తిరుపతి, శంకర్, రాజు, ఖుషి.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రామ్ యాదవ్, గీతా, నాలుగేళ్ల చిన్నారి హిమాన్షుగా గుర్తించారు.

నిర్మాణంలో ఉన్న రిటన్నింగ్ వాల్ అక్కడ పని చేస్తున్నవారిపై పడడంతో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న జీహెచ్‌ఎంసీ, ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది జాయింట్ ఆపరేషన్ చేపట్టి డెడ్‌బాడీలను జేసీబీల సాయంతో బయటికి తీశారు. ఘటనకు సంబంధించి బిల్డర్, సెంట్రింగ్ కూలీల కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories