Nagarjuna Sagar: నాగార్జునసాగర్‌కు పెరుగుతున్న వరద నీరు

Nagarjuna Sagar: శ్రీశైలం నుంచి 4 లక్షల 54వేల క్యూసెక్కుల వరద ఇన్‌ఫ్లో * 570 అడుగులకు చేరుకున్న నీటి మట్టం

Sandeep Eggoju
Updated on: 31 July 2021 2:04 PM IST
4 Lakh 54 Thousand Cusecs Water Inflow From Srisailam To Nagarjuna Sagar
X
శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు వరద ఉదృతి (ఫోటో ది హిందూ)

Nagarjuna Sagar: నాగార్జునసాగర్ జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ శ్రీశైలం నుంచి 4 లక్షల 54వేల క్యూసెక్కుల వరద ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతోంది. దాంతో సాగర్ జలాశయం వడి వడిగా నిండుతోంది. నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం 590 అడుగులకు దాదాపు ప్రస్తుతం 570 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. సాగర్ నుంచి విద్యుత్ ఉత్పత్తి ద్వారా, ఏ ఎమ్మార్పీ ద్వారా కలిపి 63 వేల క్యూసెక్కుల నీరు ఔట్ ఫ్లోగా వెళ్తుంది. ప్రస్తుతం సాగర్ నీటిమట్టం 254 టీఎంసీలకు చేరుకుంది. సాగర్ జలాశయంకు భారీగా వరద రావడంతో క్రస్ట్ గేట్లను సీఈ శ్రీకాంతరావు, ఎస్ ఈ ధర్మ నాయక్ లు ఇంజనీరింగ్ అధికారుల తో కలిసి పరిశీలించారు. నాగార్జున సాగర్ జలాశయం ఇదే వరద కొనసాగితే మరొక రెండు రోజుల్లో క్రస్ట్ గేట్లను ఎత్తే అవకాశం ఉందని జలాశయం ఎస్ఈ ధర్మ నాయక్ తెలిపారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story