Peddapalli: పుట్టిన రోజే మృత్యు ఒడికి.. వేడి సాంబార్‌ పాత్రలో పడిన బాలుడు

Peddapalli: పెద్దపల్లి జిల్లా మల్లాపూర్ గురుకుల పాఠశాలలో హాస్టల్లో విషాదం చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 9 Dec 2025 12:39 PM IST
Peddapalli: పుట్టిన రోజే మృత్యు ఒడికి.. వేడి సాంబార్‌ పాత్రలో పడిన బాలుడు
X

Peddapalli: పుట్టిన రోజే మృత్యు ఒడికి.. వేడి సాంబార్‌ పాత్రలో పడిన బాలుడు

Peddapalli: పెద్దపల్లి జిల్లా మల్లాపూర్ గురుకుల పాఠశాలలో హాస్టల్లో విషాదం చోటుచేసుకుంది. వేడి సాంబార్‌లో పడి మొక్షిత్ అనే మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. మొక్షిత్ తల్లి తండ్రులు గురుకుల పాఠశాలలో వంట మనుషులుగా పని చేస్తున్నారు.

మొక్షిత్ తండ్రి సాంబారు చల్లారడం కోసం పొయ్యి మీద నుంచి దించి పక్కన పెట్టగా అటు పక్కగా ఆడుకుంటున్న మొక్షిత్ వేడిగా ఉన్న సాంబార్ పాత్రలో పడ్డాడు. గమనించిన తల్లిదండ్రులు బాలుడిని హాస్పిటల్‌కు తరలించే లోపే మొక్షిత్ మృతి చెందాడు. పుట్టిన రోజే మొక్షిత్ మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story