TS Elections: తెలంగాణలో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా 3 నియోజకవర్గాలు

TS Elections: కరీంనగర్‌ నియోజకవర్గంలో 53.71 శాతం పోలింగ్‌

Shekhar G
Published on: 30 Nov 2023 4:05 PM IST
3 Constituencies as Center Of Attraction In Telangana
X

TS Elections: తెలంగాణలో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా 3 నియోజకవర్గాలు

TS Elections: గజ్వేల్‌ నియోజకవర్గ ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గెలుపెవరిదీ..? మెజార్టీ ఎంత వస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ముగ్గురు నేతల మధ్య విజయం ఎవరిని వరిస్తుందనే దానిపై లెక్కలు వేసుకుంటున్నారు. గజ్వేల్‌ బరిలో ఈసారి మొత్తం 44 మంది ఉన్నప్పటికీ ముగ్గురి మధ్యే తీవ్ర పోటీ నెలకొంది. ఇక అందరి చూపు కామారెడ్డి నియోజకవర్గం వైపే ఉంది.

కొడంగల్ నుంచి రేవంత్‌రెడ్డి బరిలో ఉన్నారు. బీఆర్ఎస్‌ నుంచి పట్నం నరేందర్‌రెడ్డి, బీజేపీ నుంచి బంతు రమేష్‌ పోటీలో ఉన్నారు. కొడంగల్‌ రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో ఈ సీటు ప్రతిష్టాత్మకంగా మారింది. జడ్పీటీసీగా ప్రస్థానం మొదలు పెట్టిన రేవంత్‌రెడ్డి... అక్కడి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో బీఆర్ఎస్‌ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. గతసారి పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా గెలుపొందారు.

Shekhar G

Shekhar G

Next Story