తెలంగాణలో కొత్తగా 2,214 కరోనా పాజిటివ్ కేసులు

X
Highlights
Coronavirus Updates in Telangana | తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న రాత్రి ...
Arun Chilukuri1 Oct 2020 4:42 AM GMT
Coronavirus Updates in Telangana | తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 2,214 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 1135కి చేరింది. నిన్న ఒక్క రోజే 2,474 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,93,600కి చేరింది. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన సంఖ్య 1,63,407కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 29,058 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 23,702 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 54,443 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటివరకు 30,50,444 టెస్టులు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Web Title2,214 new coronavirus cases reported in Telangana
Next Story