తెలంగాణలో కొత్తగా 2,154 కరోనా కేసులు

X
Highlights
Coronavirus Updates in Telangana | తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న రాత్రి ...
Arun Chilukuri7 Oct 2020 4:42 AM GMT
Coronavirus Updates in Telangana | తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 2,154 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 1189కి చేరింది. నిన్న ఒక్క రోజే 2,239 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,04,748కి చేరింది. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన సంఖ్య 1,77,008కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 26,551 యాక్టివ్ కేసులు ఉన్నాయని, మరో 21,864 మంది హోం ఐసోలేషన్లో ఉన్నట్లు ఆరోగ్యశాఖ చెప్పింది. గడిచిన 24 గంటల్లో 54,277 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటివరకు 33,46,472 టెస్టులు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Web Title2,154 new coronavirus cases reported in Telangana
Next Story