Telangana: 20వ రోజు కొనసాగుతున్న లాక్డౌన్
Telangana: లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తోన్న పోలీసులు * అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారిని మందలిస్తున్న పోలీసులు
హైదరాబాద్ లొక్డౌన్ (ఫైల్ ఇమేజ్)
Telangana: తెలంగాణలో 20వ రోజు లాక్డౌన్ కొనసాగుతోంది. సడలింపు సమయం దాటిన తర్వాత రోడ్లపైకి వచ్చే వారిని పోలీసులు మందలిస్తున్నారు. వారి వాహనాలు సీజ్ చేసి.. కేసులు నమోదు చేస్తున్నారు. మరోసారి లాక్డౌన్ పొడిగించే అవకాశం లేకుండా కఠినంగా అమలు చేస్తున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు లాక్డౌన్ సడలింపు ఇచ్చారు. సడలింపు సమయంలో బయటకు వచ్చిన వారు ఇంటికి వెళ్లేందుకు మరో గంటపాటు సమయం ఇచ్చారు. మినహాయింపు సమయం దాటినా జనాలు రోడ్లపై మీదే ఉన్నారు.. రాచకొండ కమిషనరేట్ పరిధిలో లాక్డౌన్ను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు.
Next Story




