WI vs IND: వెస్టిండీస్ టెస్టులో యశస్వీజైస్వాల్, రోహిత్ శర్మ సెంచరీలు నమోదు

Yashasvi Jaiswal And Rohit Sharma Registered Centuries In The West Indies Test
x

WI vs IND: వెస్టిండీస్ టెస్టులో యశస్వీజైస్వాల్, రోహిత్ శర్మ సెంచరీలు నమోదు

Highlights

WI vs IND: ఓపెనర్లుగా 229 అత్యధిక పరుగుల భాగస్వామ్యంతో రికార్డు

WI vs IND: వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టుమ్యాచ్‌లో టీమిండియా సత్తా చాటిందిం. తొలి ఇన్నింగ్స్‌లో రవిచంద్ర అశ్విన్, రవీంద్ర జడేజా మాయాజాల బంతులతో 150 పరుగులకే కరేబియన్లను కట్టడి చేశారు. తొలిరోజే బ్యాటింగ్‌కు దిగిన యశస్వీ జైస్వాల్, రోహిత్ శర్మ ధాటిగా రాణించారు. మరుసటి రోజు మ్యాచ్‌లో వికెట్ పడనీకుండా... నింపాదిగా ఆడుతూ ఒక్కో పరుగు రాబట్టుకుంటూ...ఓపెనర్లు ఇద్దరూ సెంచరీలు నమోదు చేశారు.

టెస్టు క్రికెట్లోకి ఆరంగేట్రం చేసిన తొలిఇన్నింగ్స్‌లోనే యశస్వీ జైస్వాల్ సెంచరీ నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. ఇక రోహిత్ శర్మ తనకెరీర్ లో మరో అద్భుత సెంచరీని నమోదు చేశాడు. 229 పరుగులవద్ద రోహిత్ శర్మ పెవీలియన్ బాట పట్టారు. యశస్వీ జైస్వాల్, రోహిత్ శర్మ ఇద్దరూ 229పరుగులతో అత్యధిక పరుగుల భాగస్వామ్యంతో సరికొత్త రికార్డును నమోదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories