World Cup 2023: పాకిస్థాన్ జట్టు ప్రపంచ కప్ కోసం భారత్‌కు రాకపోతే ఏమవుతుంది.. ఐసీసీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉందంటే?

What Will Happen if the Pakistan Team Does not Come to India for the World Cup 2023 What is the ICC Action Plan
x

World Cup 2023: పాకిస్థాన్ జట్టు ప్రపంచ కప్ కోసం భారత్‌కు రాకపోతే ఏమవుతుంది.. ఐసీసీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉందంటే?

Highlights

ODI World Cup 2023: వన్డే ప్రపంచ కప్ 2023 కోసం తమ జట్టును భారత్‌కు పంపడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికీ భయపడుతోంది. పాకిస్థాన్ జట్టు భారత్‌కు రాకపోతే ఐసీసీ పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు.

ODI World Cup 2023: వన్డే ప్రపంచ కప్ 2023 కోసం పాకిస్తాన్ క్రికెట్ జట్టు భారత్‌కు వస్తుందా లేదా అనే దాని గురించి ఇంకా ఏమీ క్లియర్ కాలేదు. అయితే, బాబర్ అజామ్ సారథ్యంలోని జట్టు భారత్‌లో 50 ఓవర్ల ప్రపంచకప్ ఆడుతుందని ఐసీసీ ఖచ్చితంగా తేల్చి చెప్పింది. అయితే పాకిస్థాన్ జట్టు భారత్‌కు రాకపోతే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం..

పాకిస్థాన్ జట్టు భారత్‌కు రాకపోతే ఏమవుతుంది?

మీడియా నివేదికల ప్రకారం, పాకిస్తాన్ జట్టు భారత్‌కు వెళ్లడానికి ప్రభుత్వం ఇంకా ఎటువంటి ఎన్‌ఓసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) జారీ చేయలేదు. పాకిస్థాన్ జట్టు భారత్‌కు రాకపోతే ఐసీసీ పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు. ODI ప్రపంచ కప్ 2023లో PAK జట్టు లేనట్లయితే, ICC మరో జట్టును టోర్నమెంట్‌లో చేర్చుకోవచ్చు. ఒకవేళ పాకిస్థాన్ స్థానంలో మరొకరిని చేర్చకపోతే, టోర్నమెంట్ 9 జట్ల మధ్య మాత్రమే నిర్వహించనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు ఆడాల్సిన జట్లకు రెండేసి పాయింట్లు ఇస్తారు.

NOC పొందడానికి PCB వేచి ఉంది..

2023 వన్డే ప్రపంచకప్ కోసం తమ జట్టును భారత్‌కు పంపడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికీ భయపడుతోంది. ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత, ప్రభుత్వం నుంచి అనుమతి పొందడంపైనే తన ఆట ఆడుతుందని పీసీబీ స్పష్టంగా చెప్పుకొచ్చింది. ఇది సున్నితమైన అంశమని, కాబట్టి బోర్డు తన ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన తర్వాత మాత్రమే ముందుకు సాగుతుందని పీసీబీ అధికారి తెలిపారు. పీసీబీ అధికారి ప్రకారం, టోర్నమెంట్‌లో లేదా వేదికలలో మేము పాల్గొనడంలో ఏదైనా సమస్య భారతదేశానికి వెళ్లడానికి ప్రభుత్వ అనుమతిని పొందడానికి సంబంధించినదని పీసీబీ ఇప్పటికే ఐసీసీకి తెలియజేసింది.

అక్టోబర్ 15న భారత్-పాకిస్థాన్ మ్యాచ్..

భారత్, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ల మధ్య అత్యంత చర్చనీయాంశమైన మ్యాచ్ అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో జరగనుంది. ODI ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్‌లు ఏడుసార్లు (1992, 1996, 1999, 2003, 2011, 2015, 2019లో) తలపడ్డాయి. ప్రతిసారీ భారత జట్టు విజేతగా నిలిచింది. 1987, 2007లో జరిగిన 50 ఓవర్ల ఫార్మాట్ వరల్డ్ కప్‌లో ఈ రెండు జట్లు ఒకదానితో ఒకటి తలపడలేదు. 2007లో రెండు జట్లు గ్రూప్ దశ దాటి ముందుకు సాగలేకపోయాయి. కాగా, 1987లో వేర్వేరు గ్రూపుల్లో ఉండడంతో ఇద్దరూ సెమీ-ఫైనల్‌లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories