భారత్ లో బెట్టింగ్ ని చట్టబద్ధం చేయాలంటూ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు

Team India Former Coach Ravi Shastri Calls For Legalisation Of Sports Betting in India
x

భారత్ లో బెట్టింగ్ ని చట్టబద్ధం చేయాలంటూ రవి శాస్త్రి సంచలన వ్యాఖ్యలు

Highlights

Ravi Shastri: టీమిండియా మాజీ కోచ్​ రవిశాస్త్రి బెట్టింగ్​పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్ లో స్పోర్ట్స్​ బెట్టింగ్​ను చట్టబద్దం చేయాలని అలా చేస్తే...

Ravi Shastri: టీమిండియా మాజీ కోచ్​ రవిశాస్త్రి బెట్టింగ్​పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్ లో స్పోర్ట్స్​ బెట్టింగ్​ను చట్టబద్దం చేయాలని అలా చేస్తే ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుందని తెలిపాడు. బెట్టింగ్​ను నిర్మూలించాలని చూసిన ఏదో ఒక రకంగా అవి జరుగుతూనే ఉన్నాయని చట్టబద్దం చేయడం వలన బెట్టింగ్​పై నిఘా ఉంచేందుకు కూడా అవకాశం కలుగుతుందని అభిప్రాయపడ్డాడు. కొన్ని ఏళ్ళుగా ఈ బెట్టింగ్ లు జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే.

భారత్ లో క్రికెట్​పై భారీగా బెట్టింగ్​లు నడుస్తుంటాయి. అందులో ముఖ్యంగా భారత్ - పాకిస్థాన్​ మ్యాచ్​, ఐపీఎల్​ వంటి సమయాలలో వేల కోట్లు చేతులు మారుతుంటాయి. ఈ కారణంగా బెట్టింగ్​ను లీగల్ చేయాలనే వాదన కొంతకాలంగా వినిపిస్తోంది. రవిశాస్త్రి కన్నా ముందు కూడా పలువురు బెట్టింగ్​కు చట్టబద్దత కల్పించాలని సూచించారు. మరోపక్క బెట్టింగ్​ను చట్టపరం​ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెట్టింగ్​ను లీగలైజ్​ చేస్తే ఇక చాలా మంది అదే పనిగా పెట్టుకునే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories