Team India Journey Video: 'టీంఇండియా' ఇంగ్లాండ్‌ జర్నీ చూశారా!

Team India England Journey
x

టీం ఇండియా ఆటగాళ్లు (ఫొటో ట్విట్టర్)

Highlights

డబ్ల్యూటీసీ ఫైనల్‌తోపాటు ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడేందుకు టీం ఇండియా బుధవారం ఇంగ్లాండ్ చేరుకున్న సంగతి తెలిసిందే.

Team India: డబ్ల్యూటీసీ ఫైనల్‌తోపాటు ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడేందుకు టీం ఇండియా బుధవారం ఇంగ్లాండ్ చేరుకున్న సంగతి తెలిసిందే. ఆ మేరకు టీం ఇండియా ఆటగాళ్ల జర్నీకి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్లో షేర్ చేసింది. 'టీం ఇండియా ఇంగ్లాండ్ చేరుకోవడంలో మరింత ఉత్సాహం పెరిగింది' అని ఆ వీడియోకి టాగ్ లైన్ చేర్చింది. కాగా, ఇంగ్లాండ్ గడ్డపై అటుపెట్టిన భారత ఆటగాళ్లు మూడు రోజుల పాటు కఠిన క్వారంటైన్‌లో ఉండనున్నారు. అనంతరం ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నారు.

ఈ వీడియోలో అక్షర్ పటేల్ మాట్లాడుతూ, ఆటగాళ్లను ఒకర్నొకరు కలుసుకోవద్దని బీసీసీఐ తమకు చెప్పిందని పేర్కొన్నాడు. ఈ మూడుల రోజులు మేం ఒంటరిగా ఉండాలని చెప్పుకొచ్చాడు. వీరితో పాటు టీం ఇండియా మహిళల జట్టు సభ్యులు కూడా మూడు రోజులు క్వారంటైన్లో ఉండనున్నారు. జూన్‌17న కోహ్లీసేన న్యూజిలాండ్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తలపడనుంది.



Show Full Article
Print Article
Next Story
More Stories