యూఏఈలో టీ20 వరల్డ్ కప్.. డేట్స్ కూడా ఫిక్స్ చేసిన ఐసీసీ

T20 World Cup to be shifted from India to UAE
x

యూఏఈలో టీ20 వరల్డ్ కప్.. డేట్స్ కూడా ఫిక్స్ చేసిన ఐసీసీ

Highlights

T20 World Cup: టీ20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు జరిగే వేదిక మారింది.

T20 World Cup: టీ20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు జరిగే వేదిక మారింది. ఇండియాలో జరగాల్సిన టీ20 మ్యాచ్‌లు యూఏఈకు మకాం మార్చుకున్నాయి. కరోనా కారణంగా ఇండియాలో మెగా టోర్నీ నిర్వహించడం సాధ్యం కాదని భావించిన ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇండియాలో అక్టోబర్ 17 నుంచి క్వాలిఫయింగ్ పోటీలు అక్బోబర్‌ 24 నుంచి సూపర్ 12 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. అయితే ఈ డేట్స్‌ను ఏ మాత్రం చేంజ్‌ చేయకుండా కేవలం వేదికను మార్చేశారు.

వాస్తవానికి టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోవడానికి బీసీసీఐకి జూన్ 28 వరకు గడువు ఇచ్చింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో యూఏఈనే బెటర్ ఛాయిస్ అని ఐసీసీ భావించింది. బీసీసీఐ తమ నిర్ణయాన్ని చెప్పక ముందే అనధికారికంగా షెడ్యూల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. యూఏఈలో అక్టోబర్‌ 15న ఐపీఎల్ ఫైనల్ ముగిసిన రెండు రోజుల తర్వాత టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్నది. నవంబర్ 14న ఫైనల్ నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories