Team India: న్యూజిలాండ్ తో మ్యాచ్ కు టీం ఇండియాలోకి ఆ స్టార్ ప్లేయర్

Team India: న్యూజిలాండ్ తో మ్యాచ్ కు టీం ఇండియాలోకి ఆ స్టార్ ప్లేయర్
x

Team India: న్యూజిలాండ్ తో మ్యాచ్ కు టీం ఇండియాలోకి ఆ స్టార్ ప్లేయర్

Highlights

Team India: ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌ను ఓడించిన తర్వాత న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌కు టీం ఇండియా రెడీ అవుతుంది. ఫిబ్రవరి 26న భారత జట్టు తొలి ప్రాక్టీస్ చేసింది. ఈ సమయంలో 2-3 విషయాలు కొత్తగా కనిపిస్తున్నాయి.

Team India: ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌ను ఓడించిన తర్వాత న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌కు టీం ఇండియా రెడీ అవుతుంది. ఫిబ్రవరి 26న భారత జట్టు తొలి ప్రాక్టీస్ చేసింది. ఈ సమయంలో 2-3 విషయాలు కొత్తగా కనిపిస్తున్నాయి. మొదట, శుభ్‌మాన్ గిల్ ప్రాక్టీస్ కోసం రాలేదు. రెండవ విషయం ఏమిటంటే భారత జట్టు బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు తను ఇంటికి రావాల్సి ఉంది. కానీ అలా జరుగలేదు. తన భారత జట్టుతోనే కనిపించాడు. తన తండ్రి మరణం కారణంగా అతను తన స్వదేశానికి తిరిగి రావలసి వచ్చింది. మోర్కెల్ తో పాటు రిషబ్ పంత్ కూడా ప్రాక్టీస్ గ్రౌండ్ కి వచ్చాడు. అనారోగ్యం కారణంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు అతను ప్రాక్టీస్ చేయలేదు.

న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌కు ముందు శుభ్‌మాన్ గిల్ మొదటి ప్రాక్టీస్‌కు రాలేదని స్పోర్ట్స్ జర్నలిస్ట్ విమల్ కుమార్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. శుభ్‌మాన్ గిల్ కాకుండా, టీమ్ ఇండియాలోని మిగిలిన ఆటగాళ్లు ప్రాక్టీస్ కోసం మైదానానికి వస్తున్నట్లు కనిపించారు. భారత జట్టుకు మోర్నే మోర్కెల్ పునరాగమనం శుభవార్త. టీం ఇండియా సపోర్ట్ స్టాఫ్‌లో మోర్కెల్ ఒక కీలక సభ్యుడు. అతను భారత జట్టు బౌలింగ్ కోచ్. పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో బౌలింగ్ కోచ్ లేకుండానే టీం ఇండియా మైదానంలోకి దిగింది. కానీ ఇప్పుడు ప్రాక్టీస్ సెషన్‌లో అతనిని చూస్తుంటే.. న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో టీమ్ ఇండియా అతని సేవలను పొందుతుందని అర్థం అవుతుంది.

మోర్కెల్ తో పాటు రిషబ్ పంత్ కూడా ప్రాక్టీస్ సెషన్ లో కనిపించాడు. ఎడమచేతి వాటం వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ పంత్ టీం ఇండియాలో ఒక ముఖ్యమైన భాగం, కానీ అతను ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. టీం ఇండియా ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్‌ను ఆడిస్తోంది. పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు పంత్ అనారోగ్యం కారణంగా ప్రాక్టీస్ చేయలేదు.

గ్రూప్ దశలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఇరు జట్లకు చివరి మ్యాచ్ అవుతుంది. దీనికి ముందు భారతదేశం, న్యూజిలాండ్ రెండూ ఇప్పటివరకు టోర్నమెంట్‌లో తమ అన్ని మ్యాచ్‌లలో గెలిచాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories