IPL 2025: పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్.. బిగ్ బాస్ లో ప్రకటించిన సల్మాన్..!

Shreyas Iyer: IPL 2025 సీజన్‌లో కొన్ని జట్లు కొత్త కెప్టెన్లతో రంగంలోకి దిగుతున్నాయి. అందులో ఒక ఫ్రాంచైజీ పేరును కూడా ప్రకటించింది.

CR Reddy
Published on: 13 Jan 2025 8:23 AM IST
Shreyas Iyer is the New Captain of Punjab Kings in IPL 2025
X

IPL 2025: పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్.. బిగ్ బాస్ లో ప్రకటించిన సల్మాన్..! 

Shreyas Iyer: IPL 2025 సీజన్‌లో కొన్ని జట్లు కొత్త కెప్టెన్లతో రంగంలోకి దిగుతున్నాయి. అందులో ఒక ఫ్రాంచైజీ పేరును కూడా ప్రకటించింది. తొలి టైటిల్ కోసం ఎదురుచూస్తున్న పంజాబ్ కింగ్స్.. స్టార్ ఇండియన్ బ్యాట్స్‌మన్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌ను తమ కొత్త కెప్టెన్‌గా నియమించింది. శ్రేయాస్ అయ్యర్‌ పేరును కూడా చాలా ప్రత్యేకమైన రీతిలో ప్రకటించారు. ప్రముఖ రియాలిటీ షో 'బిగ్ బాస్' హోస్ట్, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రత్యేక ఎపిసోడ్‌లో శ్రేయాస్ అయ్యర్‌ ను పంజాబ్ కింగ్స్‌కు కొత్త కెప్టెన్‌గా ప్రకటించారు.

జనవరి 12 ఆదివారం ప్రసారమైన బిగ్ బాస్ 'వీకెండ్ కా వార్' ప్రత్యేక ఎపిసోడ్‌లో సల్మాన్ ఖాన్ అయ్యర్ పేరును ప్రకటించారు. ఈ కార్యక్రమానికి అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, శశాంక్ సింగ్ ప్రత్యేకంగా అతిథులుగా హాజరయ్యారు. ముగ్గురు ఆటగాళ్లు పంజాబ్ కింగ్స్‌లో భాగమే. అయ్యర్‌ను ఫ్రాంచైజీకి కొత్త కెప్టెన్‌గా నియమిస్తారని ఇప్పటికే ఊహాగానాలు వినిపించాయి. సల్మాన్ ఖాన్ ఈ విషయాన్ని అధికారికంగా షోలో ప్రకటించారు.

స్టైలిష్ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ అయిన శ్రేయాస్ అయ్యర్‌ గత సీజన్ వరకు కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. అతని నాయకత్వంలో కోల్‌కతా ఐపీఎల్ 2024 టైటిల్‌ను గెలుచుకుంది. అయితేకొత్త సీజన్‌కు ముందు, ఫ్రాంచైజ్, శ్రేయాస్ అయ్యర్‌ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. దీని తర్వాత నవంబర్‌లో జరిగిన మెగా వేలంలో, పంజాబ్ కింగ్స్ అయ్యర్‌ను రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనితో శ్రేయాస్ అయ్యర్‌ పంజాబ్ తరఫున అత్యంత ఖరీదైన ఆటగాడిగా, ఐపీఎల్ చరిత్రలో రెండవ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు.

ఐపీఎల్‌లో అయ్యర్ కెప్టెన్సీ వహించనున్న మూడవ జట్టు ఇది. అలా చేసిన మొదటి కెప్టెన్ కూడా అతను అయ్యాడు. ఇప్పటివరకు చాలా మంది ఆటగాళ్ళు 2 జట్లకు నాయకత్వం వహించారు కానీ శ్రేయాస్ అయ్యర్‌ మూడు జట్లకు నాయకత్వం వహించిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. శ్రేయాస్ అయ్యర్‌ కెప్టెన్సీ పొందడానికి ఒక కారణం ఆయన నాయకత్వంలోని జట్ల మంచి ప్రదర్శన. కోల్‌కతా మాత్రమే కాదు, గత ఏడాది నవంబర్-డిసెంబర్‌లో ముంబై జట్టు సయ్యద్ ముష్తాక్ అలీ టీ20 ట్రోఫీ టైటిల్‌ను కూడా అయ్యర్ సాధించాడు. శ్రేయాస్ అయ్యర్‌ మాత్రమే పంజాబ్ కెప్టెన్సీని పొందలేదు.. స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కూడా జట్టు కెప్టెన్‌గా నియమితులయ్యారు. ఇది షాకింగ్ గా అనిపించవచ్చు కానీ ఇది నిజం. శ్రేయాస్ అయ్యర్‌ లేనప్పుడు జట్టును నడిపించే వైస్ కెప్టెన్‌గా చాహల్‌ను నియమించారు. ఈ విషయాన్ని కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌ స్వయంగా వెల్లడించాడు.

CR Reddy

CR Reddy

Next Story