IND vs BAN 2nd Test: రెండో టెస్ట్ నుంచి యంగ్ ప్లేయర్ ఔట్.. షాకింగ్ న్యూస్ చెప్పిన అజిత్ అగార్కర్.. కారణం ఏంటంటే?

Indian Cricket Team: భారత్-బంగ్లాదేశ్ మధ్య 2 టెస్టుల సిరీస్‌లో రెండో మ్యాచ్ కాన్పూర్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు జరగనుంది. చెన్నైలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 280 పరుగుల తేడాతో విజయం సాధించింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 25 Sept 2024 7:48 PM IST
sarfaraz khan out of the indian team now he will get chance to play under ajinkya rahane captaincy in Irani cup
X

IND vs BAN 2nd Test: రెండో టెస్ట్ నుంచి యంగ్ ప్లేయర్ ఔట్.. షాకింగ్ న్యూస్ చెప్పిన అజిత్ అగార్కర్.. కారణం ఏంటంటే?

Indian Cricket Team: భారత్-బంగ్లాదేశ్ మధ్య 2 టెస్టుల సిరీస్‌లో రెండో మ్యాచ్ కాన్పూర్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు జరగనుంది. చెన్నైలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 280 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరోవైపు అక్టోబర్ 1 నుంచి 5 వరకు లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో ఇరానీ కప్ జరగనుంది. ఇందులో రంజీ ట్రోఫీ ఛాంపియన్ ముంబై, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుతో తలపడనుంది.

తొలి టెస్టులో సర్ఫరాజ్‌కు నో ఛాన్స్..

బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్‌కు టీమిండియాలో ఎంపికైన సర్ఫరాజ్ ఖాన్‌ను ఇరానీ కప్‌కు విడుదల చేయవచ్చు అని తెలుస్తోంది. ప్రస్తుతానికి రోహిత్ శర్మ జట్టు నుంచి సర్ఫరాజ్‌ను తొలగించవచ్చని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదికలో పేర్కొన్నారు. చెన్నై టెస్టులో అతనికి ఆడే అవకాశం రాలేదు. సర్ఫరాజ్ స్థానంలో కేఎల్ రాహుల్ ప్లేయింగ్-11లో ఎంపికయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ భారీ స్కోరు చేయడంలో విఫలమయ్యాడు.

కాన్పూర్ నుంచి లక్నోకు..

టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, ఇరానీ కప్ కోసం సర్ఫరాజ్‌ను విడుదల చేయాలని భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కోరుకుంటున్నారు. ఎవరైనా ఆటగాడికి గాయమైతే మాత్రమే సర్ఫరాజ్‌ను ఆపనున్నట్లు తెలిపాడు. ఏది ఏమైనా లక్నో నుంచి కాన్పూర్ చేరుకోవడానికి కనీసం గంట సమయం పడుతుంది. ఇటువంటి పరిస్థితిలో, కాన్పూర్ టెస్టు ప్రారంభమైన తర్వాత కూడా సర్ఫరాజ్ లక్నోకు వెళ్లవచ్చు అని తెలపనున్నాడు.

రహానే కెప్టెన్సీలో సర్ఫరాజ్..

లక్నోలో జరిగే ఇరానీ కప్ మ్యాచ్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియాతో రంజీ ట్రోఫీ ఛాంపియన్ ముంబైతో అజింక్య రహానే కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. సర్ఫరాజ్ జట్టులోకి వస్తే రహానే కెప్టెన్సీలో ఆడనున్నాడు. ఈ మ్యాచ్‌తో భారత ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో పునరాగమనం చేయనున్నాడు. గాయం కారణంగా చాలా కాలంగా దూరంగా ఉన్నాడు. శ్రేయాస్ అయ్యర్, ముషీర్ ఖాన్, షామ్స్ ములానీ, తనుష్ కొటియన్ సహా టాప్ ప్లేయర్స్ అందరూ ముంబై తరఫున ఆడనున్నారు. సూర్యకుమార్ యాదవ్, ఆల్ రౌండర్ శివమ్ దూబే ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండవచ్చు. బంగ్లాదేశ్‌తో అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్ కోసం వీరిద్దరూ గ్వాలియర్ వెళ్లాల్సి ఉంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story