Rohit Sharma: 'రోహిత్, నీ కెరీర్ ముగిసింది, బుమ్రా కెప్టెన్ అవుతాడు'... భారత కెప్టెన్సీకి సంబంధించి ఈ మాటలు ఎవరన్నారంటే..?

Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఒత్తిడి నానాటికీ పెరుగుతోంది.

CR Reddy
Published on: 30 Dec 2024 8:26 AM IST
Rohit Sharmas Career is Over Jaspreet Bumrah will be the New Captain of Team India
X

Rohit Sharma: 'రోహిత్, నీ కెరీర్ ముగిసింది, బుమ్రా కెప్టెన్ అవుతాడు'... భారత కెప్టెన్సీకి సంబంధించి ఈ మాటలు ఎవరన్నారంటే..?

Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఒత్తిడి నానాటికీ పెరుగుతోంది. న్యూజిలాండ్ చేతిలో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 0-3తో క్లీన్ స్వీప్ చేసిన తర్వాత, ఆస్ట్రేలియా పర్యటనలో కూడా అతని కెప్టెన్సీలో టీమ్ ఇండియా కష్టపడుతోంది. రోహిత్ కెప్టెన్సీ నిరంతరం ప్రశ్నార్థకంగానే ఉంటుంది. అతడు వరుసగా బ్యాటింగులో విఫలం అవుతున్నాడు. దీంతో అతడిని తొలగించాలని.. జట్టునుంచి తప్పించాలన్న డిమాండ్లు నిరంతరం పెరుగుతున్నాయి. మెల్‌బోర్న్ టెస్ట్ తర్వాత రోహిత్ రిటైర్ అవుతాడా? సిడ్నీ టెస్టులో జస్ప్రీత్ బుమ్రా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తారా? తాను భారత జట్టు సెలక్టర్‌గా ఉండి ఉంటే.. సరిగ్గా ఇదే చేసి ఉండేవాడినని ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మార్క్ వా అన్నాడు.

మెల్బోర్న్ టెస్ట్ నాలుగో రోజు వ్యాఖ్యానిస్తూ, మార్క్ వా భారత కెప్టెన్ గురించి ఈ పదునైన ప్రకటన చేసాడు. ఈ టెస్ట్ తర్వాత అతడిని తొలగించాలంటూ పూర్తి మద్దతు తెలిపాడు. అడిలైడ్ టెస్టు నుంచి టీమ్ ఇండియాకు తిరిగి వచ్చిన రోహిత్, డే-నైట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విఫలమయ్యాడు, ఆపై బ్రిస్బేన్‌లో కూడా తను బ్యాటింగ్ లో ఘోరంగా విఫలం అయ్యాడు. మెల్‌బోర్న్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బ్యాడ్ షాట్లు ఆడి ఔటయ్యాడు.

రోహిత్ ఈ ప్రదర్శన చూసి డ్రాప్ లేదా రిటైర్మెంట్ తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టర్ ఫాక్స్ క్రికెట్ కోసం సిరీస్‌పై వ్యాఖ్యానించిన మార్క్ వా, మెల్‌బోర్న్ టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో విఫలమైతే తాను కూడా అలాగే చేసి ఉండేవాడినని చెప్పాడు. అతను ఇలా అన్నాడు, "నేను సెలెక్టర్‌గా ఉంటే.. అతను రెండవ ఇన్నింగ్స్‌లో (మెల్‌బోర్న్ టెస్ట్) కూడా పరుగులు చేయకపోతే, నేను అతనితో 'రోహిత్, మీకు ధన్యవాదాలు. మీ సేవలు మరువలేనివి. మీరు గొప్ప ఆటగాడు. కానీ మేము జస్ప్రీత్ బుమ్రాను ఎస్ సీజీ టెస్ట్‌కు కెప్టెన్‌గా చేస్తున్నాము. మీ కెరీర్ ఇక్కడితో ముగుస్తుంది.’’ అని చెప్పే వాడినన్నారు.

డిసెంబరు 30న మెల్‌బోర్న్ టెస్టు చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ ఎలా రాణిస్తాడనే దానిపై ఆధారపడి ఉంటుంది. టీమ్ ఇండియా గెలవాలంటే 330 పరుగులకు పైగా లక్ష్యాన్ని సాధించాలి. ఇక్కడ టీమ్ ఇండియా విఫలమైతే, రోహిత్ స్వయంగా బ్యాటింగ్ చేయకపోతే, వారిపై ఒత్తిడి మరింత పెరుగుతుంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు 4 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన రోహిత్ 22 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 70 బంతులు మాత్రమే క్రీజులో నిలువగలిగాడు.

CR Reddy

CR Reddy

Next Story