PV Sindhu: తెలుగు రాష్ట్రాలకు పీవీ సింధు విరాళం

PV Sindhu: తెలుగు రాష్ట్రాలకు పీవీ సింధు విరాళం
x
Highlights

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రభుత్వాలు కూడా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఇలాంటి కష్టకాలంలో సినిమా సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు అండగా...

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రభుత్వాలు కూడా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఇలాంటి కష్టకాలంలో సినిమా సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. మేమున్నామంటూ ముందుకొస్తున్నారు. వారికి తోచిన సాయాన్ని అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనాపై పోరాటానికి తాజాగా బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తెలుగు రాష్ట్రాలకు రూ.5 లక్షల చొప్పున విరాళం ప్రకటించింది. "కొవిడ్-19పై సమరంలో తలమునకలై ఉన్న తెలుగు రాష్ట్రాలకు చేయూతగా నిలుద్దామని నిర్ణయించుకున్నాను. అందుకే తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్, ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ పండ్ కు విరాళం ప్రకటిస్తున్నా" అంటూ సింధు ట్విట్టర్ లో వెల్లడించింది.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories