క్వార్టర్ ఫైనల్‌కు పీవీ సింధు, ప్రణయ్.. మలేషియా ఓపెన్‌‌‌లో మనోళ్ల హవా...

Malaysia Open-2022, Badminton, HS Prannoy, Pv sindhu, Sports news
x

క్వార్టర్ ఫైనల్‌కు పీవీ సింధు, ప్రణయ్.. మలేషియా ఓపెన్‌‌‌లో మనోళ్ల హవా...

Highlights

Malaysia Open-2022: ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు మలేషియా ఓపెన్‌లో దూసుకుపోతోంది.

Malaysia Open-2022: ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు మలేషియా ఓపెన్‌లో దూసుకుపోతోంది. ప్రీ క్వార్టర్స్‌లో సింధు థాయ్‌లాండ్ ప్లేయర్ ఫిట్టయాపోర్న్ పై విజయం సాధించింది. మొత్తం 57 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో సింధు ఫస్ట్ గేమ్‌ను 19-21తో కోల్పోయింది. అయితే రెండో గేమ్‌ను 21-9 గెలుచుకుంది. ఇదే జోరును కొనసాగించిన సింధు, నిర్ణయాత్మక గేమ్‌లోనూ సూపర్ స్మాష్‌లు, షాట్లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. అదే క్రమంలో 21-14తో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

అటు పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ 21వ ర్యాంకర్ ప్రణయ్ కూడా క్వార్టర్ ఫైనల్స్‌కు చేరకున్నాడు. ప్రీ క్వార్టర్‌లో నాలుగో సీడ్ చైనీస్ తైపీకి చెందిన చౌ టియెన్ చెన్‌పై 21-15, 21-7 తేడాతో సునాయాసంగా విజయం సాధించాడు. ఇక మలేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి షట్లర్ పారుపల్లి కశ్యప్ వైదొలిగాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories