Asian Games 2023: వామ్మో.. ఏంది ఇది.. 9 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. యూవీ ప్రపంచ రికార్డ్ బద్దలు కొట్టిన నేపాల్ ప్లేయర్..!

Nepal vs Mongolia: టీ20ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేసిన భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ రికార్డు బద్దలైంది. నేపాల్‌కు చెందిన ఓ ఆటగాడు కేవలం 9 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించాడు.

Shekhar G
Published on: 27 Sept 2023 2:25 PM IST
Nepal Player Dipendra Singh Airee Breaks Yuvraj Singhs Fastest Half Century In T20i Record
X

Asian Games 2023: వామ్మో.. ఏంది ఇది.. 9 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. యూవీ ప్రపంచ రికార్డ్ బద్దలు కొట్టిన నేపాల్ ప్లేయర్..!

Fastest 50 in T20 Internationals: ఆసియా గేమ్స్ 2023 పురుషుల క్రికెట్‌లో నేపాల్‌కు చెందిన ఆటగాడు మొదటి మ్యాచ్‌లో చరిత్ర సృష్టించాడు. ఈ ఆటగాడు యువరాజ్ సింగ్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ టీ20లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు బద్దలైంది. యువరాజ్ సింగ్ 12 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన ఘనత సాధించాడు. కానీ, ఈ ఆటగాడు కేవలం 9 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి క్రికెట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించాడు.

యువరాజ్ సింగ్ ప్రపంచ రికార్డు బద్దలు..

భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై 12 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. అదే మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఒక ఓవర్‌లో యువరాజ్ 6 సిక్సర్లు బాదాడు. ఇప్పుడు ఈ రికార్డును నేపాల్‌కు చెందిన దీపేంద్ర సింగ్ ఎయిరీ బద్దలు కొట్టాడు. దీపేంద్ర సింగ్ టీ20లో కేవలం 9 బంతుల్లోనే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించాడు. ఈ సమయంలో దీపేంద్ర సింగ్ 10 బంతుల్లో 8 సిక్సర్లతో అజేయంగా 52 పరుగులు చేశాడు. అదే సమయంలో దీపేంద్ర తన తొలి 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదాడు.

ఫాస్టెస్ట్ సెంచరీ..

నేపాల్‌ బ్యాట్స్‌మెన్‌ కుశాల్‌ మల్లా కూడా టీ20 చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించాడు. టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో 35 బంతుల్లో సెంచరీ చేసిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ, దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ డేవిడ్ మిల్లర్ రికార్డును కుశాల్ మల్లా బద్దలు కొట్టాడు. మంగోలియా జట్టుపై కుశాల్ మల్లా కేవలం 34 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. మల్లా 50 బంతుల్లో 8 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో మొత్తం 137 పరుగులు చేశాడు.

అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో తొలిసారి 300 పరుగులు..

ఈ మ్యాచ్‌లో మంగోలియా జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. అంతర్జాతీయ టీ20 చరిత్రలో ఇదే అతిపెద్ద స్కోరు. అదే సమయంలో అంతర్జాతీయ క్రికెట్‌లో టీ20లో 300 పరుగుల మార్క్‌ను దాటిన తొలి జట్టుగా నేపాల్‌ నిలిచింది.

Shekhar G

Shekhar G

Next Story