
Ravindra Jadeja : జడేజా చేసిన పెద్ద తప్పు.. మాంచెస్టర్ టెస్ట్లో సీన్ ఎలా మారిందంటే?
Ravindra Jadeja : ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా చాలా సందర్భాల్లో బాగా ఆడినా సిరీస్లో మాత్రం వెనకబడింది. దీనికి ప్రధాన కారణం జట్టులో క్రమశిక్షణ లోపమే.
Ravindra Jadeja : ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా చాలా సందర్భాల్లో బాగా ఆడినా సిరీస్లో మాత్రం వెనకబడింది. దీనికి ప్రధాన కారణం జట్టులో క్రమశిక్షణ లోపమే. అది ఫీల్డింగ్, బౌలింగ్, కొన్నిసార్లు బ్యాటింగ్, క్యాచ్లను వదిలేయడం, నో-బాల్స్ వేయడం, రనౌట్లు వంటి పొరపాట్లు టీమిండియాకు చాలా నష్టం కలిగించాయి. అయితే, మాంచెస్టర్లో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్లో రెండో రోజు అలాంటి ఒక తప్పు టీమిండియాకు ఊహించని లాభాన్ని చేకూర్చింది. ఈ తప్పు చేసింది స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా. ఆయన తరచుగా నో-బాల్స్తో సమస్యలు క్రియేట్ చేస్తున్నారు. కానీ ఈసారి మాత్రం ఆయన జట్టుకు మేలు చేసారు.
ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో గురువారం జరిగిన టెస్ట్ మ్యాచ్ రెండో రోజు టీమిండియా మొదటి ఇన్నింగ్స్ 358 పరుగులకే ముగిసింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ బ్యాటింగ్ మొదలుపెట్టింది. వారి ఓపెనర్లు జాక్ క్రాలీ, బెన్ డకెట్ టీమిండియాకు వికెట్ల కోసం ఎదురుచూసేలా చేశారు. లీడ్స్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ తర్వాత, ఈ ఇద్దరూ మళ్లీ ఒక పెద్ద భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 30 ఓవర్లలోపే 150 పరుగులకు పైగా జోడించారు. అప్పటికి టీమిండియాకు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ఇద్దరు ఓపెనర్లు అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.
జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ తో పాటు కొత్త బౌలర్ అన్షుల్ కంబోజ్ కూడా విఫలమవుతున్నారు. ఇలాంటి సమయంలో రవీంద్ర జడేజాపై అందరి దృష్టి ఉంది.. కానీ ఆయన కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. పైగా పరుగులిచ్చేస్తున్నారు. అప్పుడు 32వ ఓవర్ వచ్చింది. ఈ ఓవర్లోని ఆఖరి బంతికి జాక్ క్రాలీ అద్భుతమైన ఫోర్ కొట్టాడు. అయితే, ఆటగాళ్లందరూ తర్వాతి ఓవర్కు సిద్ధమవుతుండగా, థర్డ్ అంపైర్ జడేజా వేసిన ఈ బంతిని నో-బాల్ గా ప్రకటించారు.
దీంతో, చివరి బంతి కోసం మళ్లీ ఫీల్డర్లందరూ తమ స్థానాలకు తిరిగి రావాల్సి వచ్చింది. జడేజా కూడా మళ్లీ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. అయితే దీనివల్ల జాక్ క్రాలీకి పెద్ద నష్టం జరిగింది. ఎందుకంటే అతని ఏకాగ్రత అప్పటికే చెదిరిపోయింది. ఈ అవకాశాన్ని టీమిండియా చక్కగా ఉపయోగించుకుంది. జడేజా మళ్లీ చివరి బంతిని వేయడానికి వచ్చాడు. ఈ బంతికి క్రాలీని స్లిప్లో ఉన్న కేఎల్ రాహుల్ చేతికి చిక్కేలా అవుట్ చేసాడు. ఇలా టీమిండియా 166 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని విడదీసి, మొదటి వికెట్ను సాధించింది.
టీమిండియాకు చాలా కష్టపడి ఈ వికెట్ దక్కింది. కొద్దిసేపటికే రెండో వికెట్ కూడా పడింది. ఈసారి ఈ పని చేసింది అరంగేట్ర బౌలర్ అన్షుల్ కంబోజ్. హర్యానాకు చెందిన ఈ ఫాస్ట్ బౌలర్ రెండో ఓపెనర్ బెన్ డకెట్ను వికెట్ కీపర్ చేతికి క్యాచ్ ఇచ్చేలా అవుట్ చేసి, అంతర్జాతీయ క్రికెట్లో తన మొదటి వికెట్ను తీసాడు. కంబోజ్ ఈ వికెట్తో డకెట్ను సెంచరీ చేయకుండా ఆపి, 94 పరుగులకే పెవిలియన్ పంపడం విశేషం. రోజు ఆట ముగిసే సమయానికి, ఈ రెండు వికెట్లు టీమిండియాకు తిరిగి పుంజుకునే ఆశను కలిగించాయి. అయితే, అప్పటికి ఇంగ్లాండ్ 2 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




