రేపే ఐపీఎల్ 2021 మినీ వేలం.. అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్న..

రేపే ఐపీఎల్ 2021 మినీ వేలం.. అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్న..
x

రేపే ఐపీఎల్ 2021 మినీ వేలం.. అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్న..

Highlights

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 కోసం రేపు మధ్యాహ్నం చెన్నైలో బీసీసీఐ మినీ వేలంను నిర్వహించనుంది. ఈ వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ ఇటీవలే...

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 కోసం రేపు మధ్యాహ్నం చెన్నైలో బీసీసీఐ మినీ వేలంను నిర్వహించనుంది. ఈ వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ ఇటీవలే ప్రకటించింది. మొత్తం 1114 మంది ఆటగాళ్లు పేరు నమోదు చేసుకోగా.. ఆయా ఫ్రాంచైజీ యాజమాన్యాల సూచనల ప్రకారం 292 మందిని షార్ట్‌ లిస్ట్‌ చేశారు. ఇందులో 164 మంది ఇండియ‌న్ ప్లేయ‌ర్లు కాగా 125 మంది విదేశీ ప్లేయ‌ర్లు. ఇక మ‌రో ముగ్గురు అసోసియేట్ దేశాల ప్లేయ‌ర్లు ఉన్నారు.

292 మంది ప్లేయ‌ర్స్ త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నారు. అయితే వీళ్ల నుంచి 61 మంది ప్లేయ‌ర్స్‌ను మాత్ర‌మే ఫ్రాంచైజీలు తీసుకోనున్నాయి. 2కోట్ల రూపాయల బేస్‌ప్రైస్‌ జాబితాలో హర్భజన్ సింగ్‌, కేదార్‌ జాదవ్,‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌, స్టీవ్‌ స్మిత్‌, షకీబ్ అల్ హసన్, మొయిన్ అలీ, సామ్ బిల్లింగ్స్, లియామ్ ప్లంకెట్, జాసన్ రాయ్, మార్క్ వుడ్ ఉన్నారు. అన్ని జట్లలో కలిసి 61 స్థానాలు ఖాళీగా ఉండగా అత్యధికంగా బెంగళూరు జట్టులో 14 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఏ జట్టులోకి ఏ ఆటగాడు వస్తాడనే దానిపై క్రికెట్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories