IPL 2022: భారత్ లోనే ఐపీఎల్-2022.. కానీ..
IPL 2022: ఈసారి భారత్ లోనే ఐపీఎల్-2022 సీజన్ నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
IPL 2022: భారత్ లోనే ఐపీఎల్-2022.. కానీ..
IPL 2022: ఈసారి భారత్ లోనే ఐపీఎల్-2022 సీజన్ నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలు, ఐపీఎల్ పాలకమండలి సభ్యులతో ఐపీఎల్ వేదికపై వర్చువల్ సమావేశం నిర్వహించింది. ఐపీఎల్ తాజా సీజన్ ఎక్కడ నిర్వహించాలన్న దానిపై చర్చించింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న బీసీసీఐ ఈసారి ఐపీఎల్ ను భారత్లోనే నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే కొవిడ్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్లు జరుగుతాయని సమాచారం. ఐపీఎల్-2022 సీజన్ సొంతగడ్డపైనే మార్చి 27న ప్రారంభం అవుతుందని ఐపీఎల్ పాలకమండలి ఛైర్మన్ బ్రజేశ్ పటేల్ సూచనప్రాయంగా వెల్లడించారు.
Next Story




