ఐపీఎల్ ఆటగాళ్ల వేలం వాయిదా...

Arun Chilukuri
Published on: 22 Jan 2021 7:59 PM IST
ఐపీఎల్ ఆటగాళ్ల వేలం వాయిదా...
X

ఐపీఎల్ ఆటగాళ్ల వేలం వాయిదా...

ఐపీఎల్ వేలం ప్రక్రియ వాయిదా పడింది. 14వ సీజన్ కోసం నిర్వహించాల్సిన ఆటగాళ్ల వేలం తేదీ మారింది. ఫిబ్రవరి మూడో వారంలో ఆక్షన్ జరగనుంది. వాస్తవానికి ఫిబ్రవరి 11న ఐపీఎల్ వేలం నిర్వహించేందుకు బీసీసీఐ సన్నద్ధమైంది. మొత్తం 8 ఫ్రాంచైజీలు ఆటగాళ్ల కొనుగోలు కోసం 196 కోట్ల మేర ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఈ మినీ వేలం ప్రక్రియను వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. వేలం ప్రక్రియ ఫిబ్రవరి మూడో వారంలో ఉంటుందని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఆయా జట్ల ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే ఆటగాళ్ల ఎంపికపై దృష్టి సారించాయి. అక్కర్లేని ఆటగాళ్లను నిర్మొహమాటంగా వదిలించుకుంటున్నాయి. ఆయా ఫ్రాంచైజీలు తాము విడిచిపెట్టిన ఆటగాళ్లతో పాటు, అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాలను కూడా విడుదల చేశాయి. దాంతో వదిలించుకున్న ఆటగాళ్లను వేలం ప్రక్రియలో అందుబాటులోకి తీసుకువస్తారని తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story