IPL 2021: ధావన్ ధనాధన్‌..పంజాబ్‌పై ఢిల్లీ విజయం

DC Won The Match
x

ధవన్ 

Highlights

IPL 2021:ఐపీఎల్‌లో ముంబై వేదికగా పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు మధ్య జరిగిన 11వ మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ అదరగొట్టింది.

IPL 2021: ఐపీఎల్‌లో ముంబై వేదికగా పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు మధ్య జరిగిన 11వ మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ అదరగొట్టింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (49 బంతుల్లో 92; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటికి పంజాబ్ బౌలర్లు చిన్నబోయారు. టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన పంజాబ్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఓపెనర్లు మయాంక్‌ అగర్వాల్‌ (36 బంతుల్లో 69; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), కేఎల్‌ రాహుల్‌ (51 బంతుల్లో 61; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలు సాధించారు. ఆఖర్లో దీపక్‌ హుడా (13 బంతుల్లో 22 నాటౌట్‌ 2 సిక్సర్లు), షారుఖ్‌ (5 బంతుల్లో 15; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడారు.

అనంతరం 196పరుగలు లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్‌ మరో 10 బంతులు మిగిలుండగానే 18.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసి గెలిచింది. పృథ్వీ షా (17 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి తొలి వికెట్‌కు 59 పరుగులు జోడించిన ధావన్, రెండో వికెట్‌కు స్మిత్‌ (9)తో 48 పరుగులు జతచేశాడు. సెంచరీకి చేరువైన దశలో రిచర్డ్‌సన్‌ బౌలింగ్‌లో ధావన్‌ అవుటయ్యాడు. అనంతరం స్టొయినిస్‌ (13 బంతుల్లో 27 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌), లలిత్‌ యాదవ్‌ (6 బంతుల్లో 12 నాటౌట్‌; 2 ఫోర్లు) వేగంగా ఆడడటంతో ఢిల్లీ విజయం సాధించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories