IPL 2020: ఆర్సీబీ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌.. కోహ్లి, ఏబీల జెర్సీల మీద కొత్త పేర్లు

IPL 2020: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విరాట్ కోహ్లి సారధ్యంలో ఈ సాలా కప్ నమదే అనే నినాదంతో ఐపీఎల్ క్రీడా స‌మ‌రానికి సన్నద్ధమవుతుంది. ఈ ఏడాది మాత్రం ఎలాగైనా విజేతగా నిలిచేందుకు పక్కా ప్రణాళికలు సిద్దం చేస్తోంది.

Karampoori Rajesh
Updated on: 21 Sept 2020 7:35 PM IST
IPL 2020: ఆర్సీబీ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌.. కోహ్లి, ఏబీల జెర్సీల మీద కొత్త పేర్లు
X

IPL 2020: Virat Kohli and AB de Villiers sporting RCB jersey with different names

IPL 2020: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విరాట్ కోహ్లి సారధ్యంలో ఈ సాలా కప్ నమదే అనే నినాదంతో ఐపీఎల్ క్రీడా స‌మ‌రానికి సన్నద్ధమవుతుంది. ఈ ఏడాది మాత్రం ఎలాగైనా విజేతగా నిలిచేందుకు పక్కా ప్రణాళికలు సిద్దం చేస్తోంది. నేడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఆర్సీబీ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో కరోనా వారియర్స్ కు ఘనమైన నివాళులు అర్పించాల‌ని ఆర్సీబీ యోచిస్తుంది. ఇందులో భాగంగా తమ జెర్సీపై 'మై కోవిడ్‌ హీరోస్‌' అని ముద్రించింది.

ఈ క్ర‌మంలోనే విరాట్‌ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌లు త‌న ఫ్యాన్స్‌కు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. వీరిద్ద‌రూ.. తమ సోషల్‌ మీడియాలో అకౌంట్ల పేర్లను మార్చేశారు. డివిలియర్స్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌కు 'పారితోష్‌ పంత్‌' అంటూ మార్చుకోగా, కోహ్లి తన ట్వీటర్‌ అకౌంట్‌ పేరుకు 'సిమ్రాన్‌జీత్‌ సింగ్‌' అంటూ మార్చుకున్నాడు. అదే సమయంలో పారితోష్‌ పంత్‌-17 జెర్సీతో ఏబీ, సిమ్రాన్‌జీత్‌ సింగ్‌-18 జెర్సీతో కోహ్లిలు కనిపిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. పారితోష్‌ పంత్ వ్య‌క్తి లాక్ డౌన్ స‌మ‌యంలో ఎంతోమంది పేద ప్రజలకు స‌హాయం చేశారంట. క‌రోనా యోధుడ్ని ఇలా గౌరవించడం నిజంగా అభినందనీయమని ఏబీని కొనియాడుతున్నారు.



Live Updates

Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story