విరాట్ కోహ్లీ ఫోర్ రియాక్షన్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్

విరాట్ కోహ్లీ ఫోర్ రియాక్షన్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్
x
Highlights

రాయల్‌ చాలెంజర్స్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై సోషల్ మీడియాలో ట్రోల్ వైరల్ అవుతున్నాయ్. గతంలో ఒక ఈజీ క్యాచ్‌ను వదిలేసిన కోహ్లీని ఆడుకున్న నెజిటన్లు,...

రాయల్‌ చాలెంజర్స్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై సోషల్ మీడియాలో ట్రోల్ వైరల్ అవుతున్నాయ్. గతంలో ఒక ఈజీ క్యాచ్‌ను వదిలేసిన కోహ్లీని ఆడుకున్న నెజిటన్లు, ఇప్పుడు ఈసారి బౌండరీ కారణంగా ట్రోల్‌ చేస్తున్నారు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి కేవలం ఒకే ఒక్క బౌండరీ సాధించాడు. అది కూడా 19 ఓవర్‌లో ఒక ఫోర్‌ కొట్టాడు. ఐతే అది కూడా తాను ఎదుర్కొన్న 25వ బంతికి ఫోర్ కొట్టాడు. ఇది కాస్త ఇప్పుడు ట్రోలింగ్‌కు కారణమైంది.

అపోజిట్‌లో రెచ్చిపోతున్న డివిలియర్స్‌కు చాన్స్ ఇద్దామని కోహ్లీ స్టైర్ రొటేట్ చేస్తూ కనిపించాడు. అందుకే నెమ్మదిగా ఆడుతూ కనిపించాడు. ఐతే కొట్టిన ఒక్క ఫోర్‌ను కూడా విరాట్ సెలబ్రేట్ చేస్తూ కనిపించడం విమర్శలకు మళ్లీ పనిచెప్పింది. నువ్ సాధించిన బౌండరీ సెంచరీ కాదు అని కొందరు, నువ్ సాధించిందేమీ లేదు ఎడ్జ్ తీసుకొని ఫోర్ పోయిందని ఇంకొందరు, ఇంత ఓవరాక్షన్ అవసరమా అని మరికొందరు ఇలా ఎవరికి నచ్చినట్లు తోచినట్లు వారు కోహ్లీని ట్రోల్ చేస్తున్నారు. ఆ మేమ్స్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.

Show Full Article
Print Article
Next Story
More Stories