IPL 2020: బెంగళూరుపై బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్

IPL 2020: బెంగళూరుపై బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్
x

IPL 2020: బెంగళూరుపై బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్

Highlights

IPL 2020: ఐపీఎల్ 2020 టోర్నీలో ఇవాళ 33వ మ్యాచ్ జరుగుతోంది. దుబాయ్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి

IPL 2020: ఐపీఎల్ 2020 టోర్నీలో ఇవాళ 33వ మ్యాచ్ జరుగుతోంది. దుబాయ్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్‌లో బెంగళూరు ప్రస్తుతం 10 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుండగా రాజస్థాన్‌ 6 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. దీంతో ప్లేఆఫ్స్‌కు చేరాలంటే స్టీవ్‌స్మిత్‌ టీమ్‌ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో బెంగళూరు 8 వికెట్ల తేడాతో గెలుపొంది రాజస్థాన్‌పై ఆధిపత్యం చెలాయించింది. ఈ నేపథ్యంలో ఎవరు గెలుస్తారనే విషయంపై ఆసక్తి పెరిగింది.

ఇక బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ టీమ్‌లో రెండు మార్పులు చేశారు. శివం దుబే స్థానంలో షాబాజ్ అహ్మద్, సిరాజ్ స్థానంలో గురుకీరట్ సింగ్ మాన్‌ను జట్టులోకి తీసుకున్నారు. షాబాజ్ అహ్మద్‌కు ఇదే ఐపీఎల్ అరంగ్రేట మ్యాచ్ కావడం విశేషం.

రాజస్థాన్ ఫ్లేయింగ్ లెవ‌న్‌: బెన్‌స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌, స్టీవ్‌స్మిత్‌(కెప్టెన్‌), సంజూ శాంసన్‌, రాబిన్‌ ఉతప్ప, రియాన్‌ పరాగ్‌, రాహుల్‌ తెవాతియా, జోఫ్రా ఆర్చర్‌, శ్రేయాస్‌ గోపాల్‌, జయదేవ్‌ ఉనద్కత్‌, కార్తీక్‌ త్యాగి

బెంగళూరు ఫ్లేయింగ్ లెవ‌న్‌: దేవ్‌దత్‌ పడిక్కల్‌, ఆరోన్‌ ఫించ్‌, విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), డివిలియర్స్‌, గురుకీరత్‌ సింగ్, వాషింగ్టన్‌ సుందర్‌, షాబాజ్‌, క్రిస్‌మోరిస్‌, ఇసురు ఉడాన, నవ్‌దీప్‌ సైని, యుజువేంద్ర చాహల్‌

Show Full Article
Print Article
Next Story
More Stories