IPL 2020: యప్ టీవీలో ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసారం...

IPL 2020: యప్ టీవీలో ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసారం...
x
Highlights

IPL 2020 | ఈ నెల 19 నుంచి జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌లను హాట్ స్టార్ లేని దేశాలలో అన్ లైన్ ప్రసారం చేసే హక్కులను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం యప్ టీవీ సొంతం చేసుకుంది.

IPL 2020 | ఈ నెల 19 నుంచి జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌లను హాట్ స్టార్ లేని దేశాలలో అన్ లైన్ ప్రసారం చేసే హక్కులను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం యప్ టీవీ సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా, యూరప్, మలేసియా, ఆగ్నేయ ఆసియా, మధ్య ఆసియా, దక్షిణ అమెరికా దేశాలలో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. సంస్థ సీఈఓ ఉదయ మాట్లాడుతూ.. 'ఐపీఎల్ ద్వారా మా యాప్ మరింత మందికి చేరువవుతుంది' అని ఆశాభావం వ్యక్తం చేసారు.

ఇక పొతే, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ సీజన్ 13 మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మొదటి మ్యాచ్ కి ఆతిథ్యం ఇచ్చే దుబాయ్ లోని అబుదాబీ ముస్తాబయింది.. మొదటి మ్యాచ్ షేక్ జాయేద్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది.. ఈ స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా రెడీ చేశారు.. రాత్రివేళ సమయంలో ఈ స్టేడియం కాంతి వెలుగులతో జిగేల్ మంటోంది..

వాస్తవానికి ఐపీఎల్ ఈ ఏడాది మార్చి 29 న ప్రారంభం కావాల్సి ఉంది. అప్పుడే దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుతుండడంతో టోర్నీని ఏప్రిల్ 15 వరకు వాయిదా వేసింది. అయినప్పటికీ కరోనావైరస్ మహమ్మారి మరింతగా పెరగడంతో ఇండియాలో ఐపీఎల్ నిర్వహణ కష్టం అని భావించి చివరికి దుబాయ్ కి షిఫ్ట్ చేసింది. ప్రస్తుతం అన్ని జట్లు అక్కడికి చేరుకొని తమ ప్రాక్టిస్ లను మొదలు పెట్టాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories