IPL 2020: కీల‌క మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ దూరం.. టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న‌ముంబాయి

IPL 2020: కీల‌క మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ దూరం.. టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న‌ముంబాయి
x

బౌలింగ్‌ ఎంచుకున్న‌ముంబాయి

Highlights

IPL 2020: ఐపీఎల్-2020లో భాగంగా షార్జా క్రికెట్‌ స్టేడియంలో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.

IPL 2020: ఐపీఎల్-2020లో భాగంగా షార్జా క్రికెట్‌ స్టేడియంలో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ముంబై తాత్కాలిక కెప్టెన్ గా పొలార్డ్‌ వ్యవహరించనున్నాడు. రోహిత్‌ స్థానంలో సౌరభ్‌ తివారీ జట్టులోకి వచ్చాడు. టాస్‌ గెలిచిన ముంబయి బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ సీజన్‌లో ముంబయి తొమ్మిది మ్యాచ్‌లు ఆడగా ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. గత మ్యాచ్‌లో పంజాబ్‌తో డబుల్‌ సూపర్‌ ఓవర్‌లో పరాజయాన్ని చవిచూసిన ముంబయి.. ఈ మ్యాచ్‌లో గెలిచి తిరిగి గెలుపుబాట పట్టాలని భావిస్తోంది.

జట్ల వివరాలు:

ముంబయి ఫ్లేయింగ్ లెవ‌న్: డికాక్‌, తివారి, సూర్యకుమార్, ఇషాన్‌ కిషన్, పొలార్డ్‌ (కెప్టెన్‌), హార్దిక్ పాండ్య‌, కృనాల్ పాండ్య, కౌల్టర్‌నైల్, రాహుల్ చాహర్, బౌల్ట్, బుమ్రా

చెన్నై ఫ్లేయింగ్ లెవ‌న్: సామ్‌ కరన్, డుప్లెసిస్, రుతురాజ్‌, రాయుడు, జగదీశన్, ఎంఎస్ ధోనీ (కెప్టెన్‌), జడేజా, దీపక్‌ చాహర్‌, శార్దూల్ ఠాకూర్‌, ఇమ్రాన్‌ తాహిర్‌, హేజిల్‌వుడ్

Show Full Article
Print Article
Next Story
More Stories