అదరగొట్టిన పాండ్యా .. సిరీస్ కైవసం

అదరగొట్టిన పాండ్యా .. సిరీస్ కైవసం
x
Highlights

సిడ్నీ వేదికగా భారత్, ఆసీస్ జట్ల మధ్య జరిగిన రెండో టీ20లో హార్దిక పాండ్యా అదరగొట్టాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

సిడ్నీ వేదికగా భారత్, ఆసీస్ జట్ల మధ్య జరిగిన రెండో టీ20లో హార్దిక పాండ్యా అదరగొట్టాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. కేఎల్ రాహుల్ (30), శిఖర్ ధావన్ (52) పరుగులు చేశారు. ఇక కెప్టెన్ కోహ్లి 24 బంతుల్లో 40 పరుగులు చేశాడు. అయితే చివర్లో మాత్రం మ్యాచ్ చాలా ఉత్కంఠకి తీసుకువచ్చింది. ఈ క్రమంలో హార్దిక పాండ్యా తన అద్భుతమైన బ్యాటింగ్ తో జట్టుకు విజయాన్ని అందించాడు. చివర్లో పాండ్యా కొట్టిన రెండు సిక్సర్లు మొత్తం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాయి. ఆసీస్ బౌలర్లలో శామ్స్, టై, స్వేప్సన్ , జంపా చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో భారత్ మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ ని సొంతం చేసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories