Team India: టీ20ల్లో టీమిండియా సారథిపై ఉత్కంఠ.. ఈ ముగ్గురిలో రోహిత్ శర్మ వారసుడిగా ఎవరో?

Rohit Sharma Retirement: భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ప్రపంచ కప్ 2024 టైటిల్ గెలిచిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 1 July 2024 12:25 PM IST
From Hardik Pandya to Rishabh Pant These 3 Players May Replace Rohit Sharma as Captain of Indian Team in T20is
X

Team India: టీ20ల్లో టీమిండియా సారథిపై ఉత్కంఠ.. ఈ ముగ్గురిలో రోహిత్ శర్మ వారసుడిగా ఎవరో?

3 Players For Team India Captaincy After Rohit Sharma Retirement: భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ప్రపంచ కప్ 2024 టైటిల్ గెలిచిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ఇదే తన చివరి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ అని, ఇకపై అంతర్జాతీయ టీ20లు ఆడబోనని చెప్పాడు. రోహిత్ శర్మ తీసుకున్న షాకింగ్ నిర్ణయానికి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కెప్టెన్ రోహిత్ రిటైరయ్యాడని తెలుస్తోంది.

ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే, రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత, భారత జట్టు తదుపరి కెప్టెన్ ఎవరు? టీ20లో టీమిండియాకు సారథ్యం వహించేందుకు అనేక ఎంపికలు ఉన్నాయి. భారత జట్టు తదుపరి కెప్టెన్‌గా ఎవరిని ఎంపిక చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

1. హార్దిక్ పాండ్యా:

రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత భారత జట్టు కెప్టెన్ రేసులో హార్దిక్ పాండ్యా ముందంజలో ఉన్నాడు. అతను టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టుకు వైస్-కెప్టెన్‌గా కూడా నియమితుడయ్యాడు. అందుకే అతను టీమిండియాకు తదుపరి కెప్టెన్ అవుతాడని భావిస్తున్నారు. హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా గుజరాత్ టైటాన్స్‌ను ఐపీఎల్‌లో ఛాంపియన్‌గా చేశాడు. దీని కారణంగా అతని వాదన మరింత బలపడింది. అతను చాలా సంవత్సరాలుగా భారత జట్టుకు ఆడుతున్నాడు. అందుకే అతను కెప్టెన్సీకి బెస్ట్ ఆప్షన్ అంటున్నారు.

2. రిషబ్ పంత్:

భారత జట్టు కెప్టెన్సీకి రిషబ్ పంత్ కూడా గొప్ప ఎంపిక కానుంది. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం అతనికి ఉండడమే ఇందుకు కారణం. ఇది కాకుండా, అతను వికెట్ కీపర్. వికెట్ల వెనుక ఉంటూ ఆటను బాగా నియంత్రించగలడు. అతను తరచుగా బౌలర్లకు చిట్కాలు ఇస్తూ కనిపిస్తాడు. అతనికి ఆ సత్తా ఉంది. అందుకే కెప్టెన్సీకి కూడా పోటీదారుగా కనిపిస్తున్నాడు.

3. శుభ్మన్ గిల్:

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇద్దరూ కలిసి భారత టీ20 జట్టు నుంచి రిటైర్ అయ్యారు. ఈ కారణంగానే శుభ్‌మన్ గిల్‌కు ఛాన్స్ రానుంది. జట్టులోకి ఎంపికయ్యే అవకాశం ఉంది. కెప్టెన్సీకి శుభ్‌మన్ గిల్ కూడా మంచి ఎంపిక కావొచ్చు. అతను చాలా ప్రశాంతమైన ఆటగాడిగా పేరుగాంచాడు. అతనికి కెప్టెన్సీ అనుభవం కూడా ఉంది. అతని బ్యాటింగ్‌పై కూడా క్వశ్చన్ మార్క్ లేదు. మ్యాచ్‌ని ఒంటిచేత్తో గెలిపించే సత్తా అతడికి ఉంది. ఈ కారణంగా అతను కూడా ఒక ఎంపిక.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story