Viral Video: సెక్యూరిటీని తప్పించుకుని గ్రౌండ్లో విరాట్ కోహ్లీ కాళ్లపై పడ్డ అభిమాని

Fan Invades Pitch to Touch Virat Kohlis Feet During Ranji Trophy Match, Video Goes Viral
x

Viral Video: సెక్యూరిటీని తప్పించుకుని గ్రౌండ్లో విరాట్ కోహ్లీ కాళ్లపై పడ్డ అభిమాని

Highlights

Viral Video: విరాట్ కోహ్లీని చూసేందుకు అభిమానులు అరుణ్ జైట్లీ స్టేడియానికి భారీగా తరలివచ్చారు.

Viral Video: విరాట్ కోహ్లీని చూసేందుకు అభిమానులు అరుణ్ జైట్లీ స్టేడియానికి భారీగా తరలివచ్చారు. ఢిల్లీ, రైల్వేస్ మధ్య రంజీ ట్రోఫీ 2024-25 మ్యాచ్ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఢిల్లీ జట్టులో ఉన్నాడు. ఈ పోటీ జనవరి 30న ప్రారంభమైంది. మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని చూడటానికి అభిమానులు స్టాండ్లలో ఉండగా, ఒక అభిమాని భద్రతా వలయాన్ని బద్దలు కొట్టుకుని మ్యాచ్ మధ్యలో మైదానంలోకి వెళ్లి అమాంతం అతడి కాళ్లపై పడ్డాడు.

మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక అభిమాని మైదానంలోకి ప్రవేశించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఒక అభిమాని స్టాండ్స్ నుండి బయటకు వచ్చి నేరుగా విరాట్ కోహ్లీ వైపు పరిగెత్తడం చూడవచ్చు. ఈ సమయంలో కోహ్లీ స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఆ అభిమాని రాగానే కోహ్లీ పాదాలపై పడిపోయాడు.

దీని తరువాత వెంటనే భద్రతా సిబ్బంది మైదానానికి చేరుకుని అభిమానిని పట్టుకుని స్టేడియం నుండి బయటకు తీసుకువెళ్లారు. ఈ సమయంలో మ్యాచ్ కొంతసేపు ఆగిపోతుంది. తరువాత భద్రతా సిబ్బంది అభిమానిని బయటకు పంపిన తర్వాత మ్యాచ్ మళ్ళీ ప్రారంభం అయింది. ఆ మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది.

విరాట్ కోహ్లీని.. అలాగే అభిమానులు వారి అభిమాన క్రికెటర్లను కలవడానికి మ్యాచ్ మధ్యలో మైదానంలోకి రావడం ఇదే మొదటిసారి కారు. అలాంటి దృశ్యాలు తరచుగా కనిపిస్తాయి. ఐపీఎల్‌లో ఇలాంటి దృశ్యాలు చాలాసార్లు కనిపించాయి.. అభిమానులు భద్రతా వలయాన్ని బద్దలు కొట్టి విరాట్ కోహ్లీని కలవడానికి వచ్చారు.

చాలా కాలం తర్వాత రంజీ ట్రోఫీలోకి తిరిగి వచ్చిన విరాట్ కోహ్లీ

12 సంవత్సరాల తర్వాత విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీలోకి తిరిగి ఎంట్రీ ఇచ్చారు. దీనికి ముందు కోహ్లీ 2012 నవంబర్‌లో టోర్నమెంట్‌లో చివరి మ్యాచ్ ఆడాడు. ఇప్పుడు రైల్వేస్‌తో జరిగే మ్యాచ్‌లో కోహ్లీ బ్యాటింగ్ చూడటానికి అభిమానులు చాలా ఆసక్తిగా చూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories