India Vs Engalnd: ఇంగ్లాండ్ టార్గెట్ 125, బ్యాటింగ్ లో తడబడిన టీంఇండియా

England Target 125 in 20 overs in first t20
x
టీం ఇండియా బ్యాట్స్ మెన్స్ శ్రేయాస్, హార్దిక్ పాండ్య
Highlights

India Vs Engalnd 1st T20: 1st టీ20లో భారత్ పరుగులు చేయడంలో తడబడింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 124 పరుగుల చేసింది.

India Vs Engalnd 1st T20: ఐదు టీ20ల సిరీస్ లో భాగంగా ఈ రోజు ప్రారంభంమైన మొదటి టీ20లో టాస్ ఓడిన టీం ఇండియా బ్యాటింగ్‌లో తడబడింది. ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో కేవలం 124/7 కే పరిమితమైంది. రాహుల్, ధావన్ తో బ్యాటింగ్ ప్రారంభించిన టీం ఇండియా..రెండో ఓవర్లో జోఫ్రా ఆర్చర్ విసిరిన బంతికి రాహుల్ (1 పరుగు 4 బంతులు) బౌల్డ్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్ వచ్చిన టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (0 పరుగులు 5 బంతులు) నిరాశపరిచాడు. మూడో ఓవర్లో రషీద్ బౌలింగ్ జోర్దాన్ కు క్యాచ్ ఇచ్చి పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు.

మరోవైపు శిఖర్ ధావన్ (4పరుగులు 12 బంతులు) కూడా పరుగుల కోసం చాలా కష్టపడుతూ.. 5 ఓవర్లో మార్క్ వుడ్ వేసిన బంతికి బౌల్డ్ అయ్యాడు. 5 ఓవర్లు ముగిసే సరికి 20 పరుగులకు 3 వికెట్లు కోల్పయి కష్టాల్లో పడింది టీం ఇండియా. అనంతరం బ్యాటింగ్ వచ్చిన శ్రేయాస్ అయ్యర్ తో కలిసి పంత్ ఇన్సింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డారు. 10 ఓవర్లకు 50 పరుగులకు 3 వికెట్లు కోల్సోయింది. ఆ తర్వాత పంత్ 21 పరుగులు (23 బంతులు, 2ఫోర్లు, 1 సిక్స్) కూడా పెవిలియన్ కు క్యూ కట్టాడు. ఇక ఆ తర్వాత టీం ఇండియాను శ్రేయాస్(67 పరుగులు 48 బంతులు, 8ఫోర్లు, 1 సిక్స్) భుజాలపై వేసుకున్నాడు. 20వ ఓవర్లో జోర్గాన్ చేతికి చిక్కి వెనుదిరిగాడు.

మిగతా బ్యాట్స్ మెన్స్ పెలియన్ కు చేరడంతో టీం ఇండియా 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 124 పరుగులు మాత్రమే చేసింది. హార్దిక్ పాండ్య 19 పరుగులు, శార్దుల్ 0 పరుగులు చేసి ఔట్ అయ్యారు. వాషింగ్ టన్ సుందర్ 3, అక్షర్ పటేల్ 7 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్ 3 వికెట్లు, రషీద్, వుడ్, జోర్దాన్, స్టోక్స్ తలో వికెట్ తీశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories