MS Dhoni : కూల్ కెప్టెన్ మరో కఠిన నిర్ణయం

MS Dhoni : కూల్ కెప్టెన్ మరో కఠిన నిర్ణయం
x

MS Dhoni 

Highlights

MS Dhoni : చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని మరో కఠిన నిర్ణయం తీసుకున్నాడు. చెన్నై జట్టులో కొందరికి కరోనా సోకడంతో సెప్టెంబర్ 19

MS Dhoni : చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని మరో కఠిన నిర్ణయం తీసుకున్నాడు. చెన్నై జట్టులో కొందరికి కరోనా సోకడంతో సెప్టెంబర్ 19 లేదా 23న తొలి మ్యాచ్ ఆడేందుకు ఆ జట్టుకు ఐపీఎల్ యాజమాన్యం అవకాశం కల్పించగా, సమయం సరిపోకున్నా సెప్టెంబర్ 19 న తొలి మ్యాచ్ ఆడేందుకు ధోని ఒకే చెప్పినట్టు సమాచారం.. ధోని తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మొదటి ఆరు రోజుల్లోనే చెన్నై జట్టు మూడు మ్యాచ్ లను ఆడాల్సి వస్తోంది. విశ్రాంతి తీసుకొనే సమయం కూడా ఉండదు.. మరి ధోని తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మ్యాచ్ ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి మరి..

రైనా, హర్బజన్ సింగ్ లేకున్నా జట్టు మాత్రం పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉందని చెన్నై యాజమాన్యం అంటుంది. ఇక సెప్టెంబర్‌ 19న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌తో తన తొలి మ్యాచ్ ని చెన్నై జట్టు ఆడనుంది. ఆ తరవాత 22న రాజస్థాన్‌ రాయల్స్‌ తో, 25న దిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ లను ఆడనుంది. ఇక అటు మొత్తం ఐపీఎల్ షెడ్యుల్ నిన్న వచ్చింది. ఈ నెల 19 నుంచి టోర్నీ ప్రారంభం కానుండగా.. ఐపీఎల్ 2020 సీజన్ మూడు వేదికల్లో మొత్తం 53 రోజులు జరగనుండగా.. 60 మ్యాచ్‌ల్ని నిర్వహించనున్నారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 07:30 ని.లకు మ్యాచ్ లు ప్రసారం కానుండగా.. ఓకే రెండు మ్యాచ్ లు ఉన్న సమయంలో మాత్రం మధ్యాహ్నం 3:30ని.లకు ప్రసారమవుతుందని తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories