ICC T20 World Cup: ఐసీసీ టీ20 ప్రపంచకప్ కు జట్టును ఎంపిక చేసిన బీసీసీఐ


ఐసీసీ టీ20 ప్రపంచకప్ కు జట్టును ఎంపిక చేసిన బీసీసీఐ
* అక్టోబర్ 17 నుంచి ఐసీసీ టీ20 ప్రపంచకప్ * నేడో రేపో జట్టును ప్రకటించే అవకాశం
ICC T20 World Cup: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ మరో నెల రోజుల్లో ఆరంభమవుతోంది. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ జట్టును బీసీసీఐ సెలక్టర్ల బృందం ఎంపిక చేసింది. నేడో రేపో జట్టును ప్రకటించనుంది.
కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, భువనేశ్వర్ కుమార్, శిఖర్ ధావన్ ప్రపంచకప్ ప్రధాన జట్టులో ఉండే అవకాశం ఉంది. ఎవరైనా గాయపడితే రిజర్వుగా వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, పృథ్వీ షా, దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణను ఎంపిక చేస్తారని సమాచారం.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



