India vs England: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ఎంపిక

BCCI Announced 18-member squad for the ODI series against England
x

India vs England: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ఎంపిక

Highlights

India vs England: ఇంగ్లండ్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం టీమిండియ జట్టును బీసీసీఐ ప్రకటించింది.

India vs England: ఇంగ్లండ్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం టీమిండియ జట్టును బీసీసీఐ ప్రకటించింది. 18 సభ్యులతో కూడిన జట్టలో మొదటి సారిగా సూర్యకుమార్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణలకు చోటుదక్కింది. తొలి టీ20లో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన సూర్యకుమార్ యాదవ్ ఇక వన్డేల్లోనూ తన అదృష్ఠాన్ని పరీక్షించుకోనున్నాడు. అటు మరో ఆటగాడు కృనాల్ పాండ్యా కూడా వన్డే జట్టులో చోటు దక్కించుకుంటే భారత ఫేస్ బౌలర్ భువనేశ్వర్ తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు.

ఇక బీసీసీఐ ప్రకటించిన భారత వన్డే జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ధావన్, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, చాహల్, కుల్‌దీప్, కృనాల్, వాషింగ్టన్ సుందర్, నటరాజన్, భువనేశ్వర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్‌ల చోటు దక్కించుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories