IPL 2020 : ఆ స్పాన్సర్‌షిప్‌పై గందరగోళం.. రద్దు చేసుకుంటేనే కొలిక్కి

IPL 2020 : ఆ స్పాన్సర్‌షిప్‌పై గందరగోళం.. రద్దు చేసుకుంటేనే కొలిక్కి
x
Highlights

గాల్వన్ లోయలో చైనా సైనికుల దుశ్చర్య కారణంగా 20 మంది భారత సైనికులు అమరులయ్యారు.

గాల్వన్ లోయలో చైనా సైనికుల దుశ్చర్య కారణంగా 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. దాంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో భారత్ లో చైనా ఉత్పత్తులని బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో ఐపీఎల్ స్పాన్సర్‌షిప్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎటూ తేల్చుకోలేకపోతోంది. గత రెండేళ్లుగా చైనాకి చెందిన వివో కంపెనీ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తుంది. దాంతో వివోతో బీసీసీఐ ఆ స్పాన్సర్‌షిప్‌ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని క్రికెట్ అభిమానులు కోరుతున్నారు.

వివో బీసీసీఐతో 2018లో ఐదేళ్లకాలానికి రూ. 2,199 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ అగ్రిమెంట్ ఐపీఎల్ 2022 సీజన్‌తో ముగియనుంది. వివో ఏటా 440 కోట్ల రూపాయలు చెల్లిస్తోంది. ఈ ఏడాది కరోనా కారణంగా మార్చి లో జరగాల్సిన ఐపీఎల్ తాత్కాలికంగా రద్దు అయింది. కాగా.. సెప్టెంబరు 26 నుంచి నవంబరు 8 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లను నిర్వహించాలని బీసీసీఐ ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ క్రమంలో స్పాన్సర్‌షిప్‌ మార్పు కష్టమని బీసీసీఐ భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం చైనాపై సీరియస్‌గా ఉండటం, కొన్ని ప్రాజెక్ట్‌లను రద్దు చేసుకుంటూ ఉండటంతో బీసీసీఐ కూడా పునరాలోచనలో పడింది.

ఐపీఎల్ ఈ సీజన్‌ నిర్వహణ, షెడ్యూల్‌పై గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ ఈ వారంలో జరగాల్సి ఉంది. కానీ.. టోర్నీ టైటిల్ స్ఫాన్సర్‌‌షిప్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటంతో మీటింగ్‌ తాత్కాలికంగా వాయిదాపడినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories