Asian Champions Trophy: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..

Asian Champions Trophy: టీ20 ప్రపంచకప్‌లో పాక్‌ చేతిలో ఎదురైన ఓటమికి భారత్ హాకీలో ప్రతీకారం తీర్చుకుంది.

hmtv Digital Team
Published on: 18 Dec 2021 3:05 PM IST
Asian Champions Trophy: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
X

Asian Champions Trophy: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం.. 

Asian Champions Trophy: టీ20 ప్రపంచకప్‌లో పాక్‌ చేతిలో ఎదురైన ఓటమికి భారత్ హాకీలో ప్రతీకారం తీర్చుకుంది. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 3-1తో పాకిస్థాన్‌ను ఓడించింది. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేశాడు. ఆకాశ్‌దీప్‌ సింగ్‌ ఒక గోల్‌ చేశాడు. అంతకుముందు అక్టోబర్ 24న టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు 10 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. ప్రపంచకప్‌లో తొలిసారిగా పాక్ చేతిలో టీమిండియా ఓడింది.

ఢాకాలో భారత్ అద్భుత విజయం ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు ఢాకా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంతో భారత్‌కు 7 పాయింట్లు ఉన్నాయి. భారత్‌కు సెమీఫైనల్‌కు చేరడం ఇప్పుడు ఖాయం. అదే సమయంలో, పాకిస్తాన్ జట్టు కూడా సెమీ-ఫైనల్‌కు చేరుకోగలదు, ఎందుకంటే ఈ టోర్నమెంట్‌లో కేవలం 5 జట్లు మాత్రమే ఆడుతున్నాయి. ప్రస్తుతం పాకిస్థాన్ జట్టుకు 1 పాయింట్ ఉంది.

హర్మన్‌ప్రీత్ అమేజింగ్

హర్మన్‌ప్రీత్ సింగ్ మ్యాచ్ మొదటి నాల్గవ క్వార్టర్స్‌లో భారత్‌కు రెండు అద్భుతమైన గోల్స్ చేశాడు. మ్యాచ్ ఆద్యంతం ఈ ఆటగాడు అద్భుతమైన ఆటను ప్రదర్శించాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా కూడా ఎంపికయ్యాడు. హర్మన్‌ప్రీత్‌తో పాటు ఆకాశ్‌దీప్ సింగ్ గోల్ చేశాడు. అదే సమయంలో పాకిస్థాన్ తరఫున జునైద్ మంజూర్ ఏకైక గోల్ చేశాడు.

తొలి క్వార్టర్ నుంచి ఒత్తిడిని కొనసాగించిన భారత ఆటగాళ్లు మ్యాచ్ తొలి క్వార్టర్ నుంచి పాకిస్థాన్‌పై ఒత్తిడి పెంచారు. తొలి క్వార్టర్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ క్వార్టర్‌లో భారత్ మరో రెండు గోల్స్ చేయగలిగింది, కానీ పాక్ గోల్ కీపర్ అలీ అమ్జాద్ రెండు సార్లు అద్భుతమైన డిఫెన్స్ చేశాడు.

రెండవ క్వార్టర్‌లో కూడా, భారత జట్టు గోల్స్ చేయడానికి నిరంతరం గోల్ పోస్ట్ పై దాడులు చేసింది. అయితే, పాకిస్తాన్ డిఫెన్స్ అద్భుతంగ డిఫెన్స్ చేయడంతో గోల్స్ చేయడం కష్టం అయింది.

రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 9-0తో ఓడించిన భారత్ .. ఈ టోర్నీలో భారత్ శుభారంభం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలి మ్యాచ్‌లో కొరియాతో స్కోరు 2-2తో డ్రా కాగా, రెండో మ్యాచ్‌లో భారత జట్టు పుంజుకుని బంగ్లాదేశ్‌ను 9-0తో ఓడించింది.

2018లో, రెండు జట్లు ఉమ్మడి విజేతలుగా నిలిచాయి

మస్కట్‌లో జరిగిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అనంతరం ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు.

hmtv Digital Team

hmtv Digital Team

Next Story